Chandrababu : మంత్రులపై చంద్రబాబు సెటైర్లు.. పిల్ల కాలువ తవ్వలేనివారు ఇరిగేషన్ మంత్రా?

కోడి గుడ్డు కథలు చెప్పేవారు పరిశ్రమల మంత్రి, పిల్ల కాలువా తవ్వలేనివారు ఇరిగేషన్ మంత్రి..వీళ్లు మన రాష్ట్ర మంత్రులు.

Chandrababu : మంత్రులపై చంద్రబాబు సెటైర్లు.. పిల్ల కాలువ తవ్వలేనివారు ఇరిగేషన్ మంత్రా?

Chandrababu

Chandrababu Naidu : మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు పంచ్ లు విసిరారు. సెటైర్లతో విమర్శలు చేశారు. మంత్రులు ఉదయం లేచింది మొదలు నన్ను తిట్టటమేపనిగా ఉంటారు. వారికి ఓ నోట్ వస్తుంది. ఆ నోట్ ను చక్కగా చదివేస్తారు. ఇక ఆరోజుకు వారి పని కంప్లీట్ అయినట్లే  అంటూ విమర్శించారు. అక్రమ మైనింగ్ చేసేవారు మైనింగ్ మంత్రి, సొంత ఊరులో పిల్లకాలువ కూడా తవ్వలేనివారు ఇరిగేషన్ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు.

తన నియోజకవర్గంలో కనీసం 10 ఇళ్లు కూడా కట్టలేనివారు హౌసింగ్ మంత్రి, పెట్టుబడుల గురించి అడిగితే కోడిగుడ్డు కథలు చెప్పేవారు పరిశ్రమల మంత్రి అంటూ సెటైర్లు వేశారు. జగన్ కు కోర్టుల్లో అనుకూలంగా తీర్పులు రావాలని యాగాలు చేసేవారు దేవాదయ శాఖామంత్రి, రైతు బజార్లను తాకట్టు పెట్టేవాడు ఆర్థిక శాఖా మంత్రి, పిల్లల జీవితాలు నాశనం చేసేవారు విద్యాశాఖా మంత్రి అంటూ చంద్రబాబు మంత్రులపై ఎద్దేవా చేశారు.

Anitha Vangalapudi : అధికారంలోకి రాగానే ఒక్కొక్కడికి తీర్చేస్తాం- వంగలపూడి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల తరువాత అమరావతి నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టిస్తానన్నారు.

వైఎస్ వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ ను ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. కోర్టులో చెప్పారు కాబట్టి అవినాశ్ అరెస్ట్ వ్యవహారం బయటకు వచ్చిందని లేకుంటే బయటకు వచ్చేది కాదన్నారు. భవిష్యత్తులో జరిగేది క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్ అని.. ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవ వధ తప్పదని అన్నారు చంద్రబాబు.