పోలీసులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్

  • Published By: srihari ,Published On : May 28, 2020 / 11:11 AM IST
పోలీసులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్

కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలను ఫ్రీగా వదిలేసినట్లు తమ నేతలను కూడా వదిలేస్తే ఎలా రోడ్డెక్కుతారో చూస్తామని ఫైర్ అయ్యారు. అధికారంలో ఎవరూ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిందన్నారు. పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా మారాలని..లేదంటే ప్రతికారం తీర్చుకోవడానికి ఎంతో సమయంలో పట్టదని వార్నింగ్ ఇచ్చారు.

పోలీసులు జవాబుదారి తనంతో పని చేయాలన్నారు. అలా చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. మీకు ఇప్పుడే పరువు పోయిందని…భవిష్యత్ లో ఇలాంటి పనుల చేస్తే మాత్రం సహించేది లేదని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవరైతే తప్పుడు పనులు చేస్తూ..తప్పుడు వ్యక్తులకు అండగా నిలబడుతున్నారో వారి గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. 

మహానాడులో ఈ తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని, జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నానని చెప్పారు. తమాషా రాజకీయాలు చేయొద్దన్నారు. ఎవరూ కూడా అధికారంలో శాశ్వతంగా ఉండలేరన్నారు. తాను కూడా అధికారంలో శాశ్వతంగా ఉంటానని అనుకున్నానని కానీ అలా జరుగలేదన్నారు. 
 

Read: మహానాడు వేళ బాబుకు షాక్ : టీడీపీ నుంచి వైసీపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్