మదనపల్లి హత్యల్లో దిమ్మతిరిగే ట్విస్టులు!! :పెద్దమ్మాయి అలేఖ్య డైరెక్షన్..తల్లి యాక్షన్..వెరసి రెండు దారుణ హత్యలు..

మదనపల్లి హత్యల్లో దిమ్మతిరిగే ట్విస్టులు!! :పెద్దమ్మాయి అలేఖ్య  డైరెక్షన్..తల్లి యాక్షన్..వెరసి రెండు దారుణ హత్యలు..

Chittor Madanapalle two daughters murder case: shocking facts revealed : చిత్తూరు జిల్లా మదనపల్లెలో పురుషోత్తం, పద్మజల ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో గంట గంటకు దిమ్మతిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో తల్లి పద్మజ ఇద్దరు అమ్మాయిల్ని దారుణంగా హత్య చేసిందనే విషయాల్లో పలు కోణాలు బైటపడుతున్నాయి. ఉన్నత చదువులు చదువుకున్న పెద్ద కూతురు అలేఖ్య గురించి దిమ్మతిరిగే విషయాలు బయటకు వస్తున్నాయి. అలేఖ్యే తన పురుషోత్తం ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్ఫ్లుయన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. చెల్లి దివ్యకి దెయ్యం పట్టిందని చెప్పి కొట్టటంతో ఆమె చనిపోవటం..తరువాత చెల్లెలి ఆత్మను నేను బంధించాను…ఆ ఆత్మను తిరిగి చెల్లెలి తనను కూడా చంపితే..తన ఆత్మ వెళ్లి చెల్లెలి ఆత్మకు తీసుకొస్తుందని చెప్పి తల్లిదండ్రుల్ని పూర్తిగా నమ్మించింది. అంతేకాదు తనను ఎలా చంపాలి? ఎక్కడ చంపాలి? అనే విషయాలన్నీ తల్లికి చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే తల్లి పద్మజ..తండ్రి పురుషోత్తం, తాను కలిసి నగ్నంగా మారి పూజలు చేశారు. ఆ తరువాత అలేఖ్య చెప్పినట్లుగానే అలేఖ్య నోటిపై రాగి చెంబు పెట్టి..దాంట్లో నవధాన్యాలు పోసి డంబెల్స్ తో అలేఖ్య తల పగులగొట్టి చంపింది తల్లి..!!

ఈకేసులో ప్రధానాంశాలేమింటంటే..ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో సంచలనం..! పెద్ద కూతురు అలేఖ్య గురించి షాకింగ్ నిజాలు..! ఈ కేసులో కీలకంగా మారాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె ఇద్దరు కూతుళ్ల హత్యల కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి వస్తున్నాయి. ఇవి తెలిసినవారంతా నిజంగా ఇలా చేస్తారా? అని షాక్ అవుతున్నారు.

ఈ దారుణాల ఘటనల్లో పెద్దమ్మాయి 27ఏళ్ల అలేఖ్య ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ హత్యల తరువాత తల్లిదండ్రులు, పద్మజ, పురుషోత్తంలను పోలీసులు అరెస్ట్ చేయగా షాకింగ్ విషయాలు బైటపడుతున్నాయి. పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చదువులో మెరిట్ స్టూడెంట్ అయిన అలేఖ్య.. చిన్నచిన్న మ్యాజిక్‌లు చేసి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేసేది. కూతురు ప్రతిభకు తల్లిదండ్రులు మురిసిపోయేవారు. పొంగిపోయేవారు. తమ కూతురికి నిజంగానే అతీత శక్తులు ఉన్నాయని నమ్మేవారు. అలా కొన్ని కొన్ని చేష్టలతో అలేఖ్యను తల్లిదండ్రులు పూర్తిగా నమ్మారు. మేము దేవుడు పంపించివాళ్లు. మీకు కూతుళ్లుగా పుట్టాం అని అలేఖ్య చెబుతుండేది. దీంతో తమ ఇద్దరు కూతుళ్లు సాక్షాత్తు శివుడు, పార్వతులని పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు మురిసిపోయేవారు. అదే విషయాన్ని పోలీసులకు చెప్పారట. అది విన్న పోలీసులు షాక్ అయ్యారు.

నిమ్మకాలు తొక్కటంతో మొదలైన అనుమానాలు హత్యల వరకూ దారితీసిన వైనం
ఈ క్రమంలో రెండు వారాల క్రితం అలేఖ్య, తన చెల్లెలు సాయి దివ్య కలిసి తమ పెంపుడు కుక్కతో బయటకు షికారుకు వెళ్లారు. అప్పుడు చిన్నకూతురు సాయి దివ్య..బయట ముగ్గు మధ్యలో ఉన్న నిమ్మకాయ తొక్కినట్లు అనుమానపడింది. అదే విషయాన్ని అక్కకు, తల్లిదండ్రులకు చెప్పింది. ‘నేను చచ్చిపోతానేమోనని చాలా భయంగా ఉంది..అని తరచూ ఏడుస్తూ చెప్పేది. తరచూ భయపడిపోయేది. దానికి అలేఖ్య ‘‘చెల్లీ నువ్వు చచ్చిపోతే నేను నిన్ను బతికిస్తానుగా’’ అంటూ అనుమానాలకు..భయాలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో దివ్యకు మరింతగా తాను నిజంగానే చచ్చిపోతాననే భయం పెరిగిపోయింది.

ఈ క్రమంలో గత శనివారం (జనవరి 23) ఓ భూత వైద్యుడితో తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ దివ్యకు తాయెత్తులు కట్టించారు. అయినా దివ్యకు తాను చచ్చిపోతాననే భయం తగ్గలేదు. అలా 24న మధ్యాహ్నం దివ్య తాను చనిపోతానంటూ ఏడుస్తూ ఇంట్లో మేడపైన ఉన్న తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు, అలేఖ్య కలిసి ఒంటి గంట సమయంలో గదిలోకి వెళ్లి దివ్యకు వేపాకులతో మంత్రాలు చేశారు. ఏవేవో మంత్రాలు జపించారు. అయినా దివ్యకు భయం తగ్గలేదు. గట్టి గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దీంతో అలేఖ్య చెల్లెలు దివ్యను చంపేయాలని..తరువాత తాను బతికిస్తానని అలేఖ్య తల్లిదండ్రుల్ని బాగా నమ్మించింది. అలా సాయంత్రం 5 గంటల సమయంలో దివ్యను డంబెల్‌తో తలపై బలంగా కొట్టి చంపేశారు.తర్వాత పదునైనా శూలంతో పొడిచి.. ముఖాన్ని కూడా చెక్కేశారు. తరువాత అలేఖ్య చెల్లెలి ఆత్మనుబంధించాను..ఇప్పుడు నన్ను కూడా మీరు చంపేయండి..చెల్లెలి ఆత్మను తీసుకొస్తాను..తరువాత ఇద్దరం కలిసి బతికి వస్తామని నమ్మించింది. తనను ఎలా చంపాలో కూడా చెప్పింది.

తల్లిదండ్రులకు బాగా నమ్మించిన అలేఖ్య..
తాను పునర్జన్మలపై ప్రయోగాలు చేశానని.. గతంలో తాను కుక్కను ఇలాగే చంపేసి బతికించానని తల్లిదండ్రులకు అలేఖ్య చెప్పింది. కూతురు మాటల్ని వాళ్లు బాగా నమ్మారు. తర్వాత పూజ గదిలోకి వెళ్లి గుండు కొట్టుకుని, బట్టలన్నీ విప్పేసి.. ఒక పల్చటి చీర ధరించింది. అనంతరం నవ ధాన్యాలు పోసిన రాగి చెంబును నోట్లో పెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. తర్వాత కొన్ని పూజలు చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో అలేఖ్యను దివ్య చంపినట్లుగానే డంబెల్స్‌తో కొట్టి తల్లిదండ్రులు అలేఖ్యను చంపారు.

అలా అలేఖ్య మాటలకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చెల్లిని తల్లిదండ్రులతో కలిసి చంపిన అలేఖ్య.. చనిపోయిన దివ్యను తీసుకొస్తానని తల్లిదండ్రుల చేతిలో దారుణంగా హతమైంది. పునర్జన్మలపై ఉన్న మూఢ నమ్మకమే ఈ హత్యలకు కారణమని నిందితులు చెప్పిన మాటల్ని బట్టి పోలీసులు భావిస్తున్నారు.

పిచ్చి పీక్స్ కు వెళ్లిపోయిన అలేఖ్య
అలేఖ్యకు విపరీతమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని ఆమె సోషల్ మీడియా అకౌంట్స్‌లో పెట్టిన పోస్టులను బట్టి అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజులుగా అలేఖ్య పెట్టిన పోస్టులు చూస్తే..పక్కా ప్లాన్ ప్రకారమే ఇవన్నీ చేసినట్లుగా అనుమానాలొస్తున్నాయి. జనవరి 22న అలేఖ్య తన పేరును ‘మోహిని’గా మార్చుకుంటూ పోస్టు చేసింది. తాను ప్రపంచ సన్యాసిని అంటూ చెప్పొకొచ్చింది. వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త ‘ఓషో’ తన ప్రేమికుడని అలేఖ్య ప్రకటించుకుంది. ఓషో అంటే తనకు చాలా చాలా ఇష్టమని ఓషో కొటేషన్స్‌ను తరచూ పోస్టు చేసేది. అలాగే తన స్టడీ రూంలో కూడా ఓషో ఫొటోను పెట్టుకుంది.

అలేఖ్య సోషల్ మీడియాలో పోస్టులో షాకింగ్ విషయాలు
అలాగే సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను కూడా అలేఖ్య ఫాలో అయ్యేది. చావు, పుట్టుకలకు సంబంధించి సద్గురు ప్రవచించిన కొటేషన్‌ను అలేఖ్య పోస్టు చేస్తుండేది. పునర్జన్మల పిచ్చిలో అలేఖ్య ఈ అఘాయిత్యానికి పాల్పడిన తరుణంలో ఆ పోస్టు ఈ హత్యల అనంతరం వైరల్ గా మారింది. అంతేకాదు అలేఖ్య పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని సపోర్టు చేస్తూ పోస్టులు చేశారు.ముస్లింలను విపరీతంగా ద్వేషించేదని ఆమె పెట్టిన పోస్టుల ద్వారా తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Alekhya (@alekhyadivs)

‘ఇస్లాం ఎప్పుడో చనిపోయింది. ముస్లింలు గతించిపోయారు
జనవరి 22న అలేఖ్య ఫేస్‌బుక్‌లో చేసిన చివరి పోస్టు కూడా ముస్లింలపైనే కావడం గమనించాల్సిన విషయం. ‘ఇస్లాం ఎప్పుడో చనిపోయింది. ముస్లింలు గతించిపోయారు. మహమ్మద్ హలాహలమైపోయారని ఈ విషయాలన్నీ తనకు శివుడే స్వయంగా చెప్పాడని అలేఖ్య ఫేస్‌బుక్ పోస్ట్ చేసింది. అంతేకాదు ‘శివ ఈజ్ కమింగ్.. వర్క్ ఈజ్ డన్ (శివుడు వస్తున్నాడు. పనైపోయింది)’ అని పోస్టులు చేసింది. వీటిని బట్టి అలేఖ్య ఎంత మూఢత్వంలోకి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు..

 

View this post on Instagram

 

A post shared by Alekhya (@alekhyadivs)

నా జుట్టు ‘హెయిర్ పిరమిడ్’ అంటూ అలేఖ్య పోస్టులు
అలేఖ్య తలపై జుట్టును కొప్పుగా చుట్టుకుని దీన్ని ‘హెయిర్ పిరమిడ్’గా చెప్పుకునేది. సాధువులు ఎందుకు ఇలా జుట్టుముడివేసుకుంటారో తనకిప్పుడు తెలిసిందని నాకా జ్నానం వచ్చిందని..ఇది చాలా అదృష్టం ఉంటే తప్ప రాదని పేర్కొంది. అలేఖ్య విపరీతంగా పుస్తకాలు చదువుతారని ఆమె పోస్టులను బట్టి తెలుస్తోంది. లాక్‌డౌన్ లో ఖాళీగా ఉండి ఆధ్యాత్మిక, సామాజిక పుస్తకాలు చాలా చాలా చదివింది.

నేను శివుడిని..నా గొంతులో హాలాహలం ఉంది. కరోనాను నేను పంపాను
అలేఖ్య తల్లి పద్మజకు చాలా దగ్గర పోలికలున్నాయి. గత మంగళవారం పోలీసులు పద్మజను అరెస్ట్ చేసే సమయంలో సగం జుట్టును కిందకు వదిలేసి సగం జుట్టును కొప్పు మాదిరిగా ముడివేసుకుంది. పోలీసులు అరెస్టు చేసే సమయంలో పద్మజ మేడపై నుంచి కిందకు వస్తూ ‘‘నేను శివుడి కోసం పుట్టిన దాన్ని. ఒక కొత్త లోకాన్ని సష్టిస్తున్నాను. శివుడి తలపైన ఏవిధంగా జుట్టు ఉంటుందో.. నా తలపై కూడా అలాగే ఉంది. నా తలపైనే శివుడు ఉన్నాడు. నేనే శివుడిని’’ అని అరుచుకుంటూ పద్మజ మాట్లాడితన విధానం పోలిసుల్నే ఆశ్చర్యపరిచింది. అలాగే పద్మజకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసే సమయంలో కూడా తాను శివుడినని, కరోనాను నేను భూమ్మీదకు పంపించానని..కలియుగంలో చెత్త పేరుకుపోయింది. ఆ చెత్తను తుడిచేయటానికి కరోనాను పంపాను. కలియుగం అంతం అయిపోయింది. సత్యయుగం ప్రారంభమైంది. తన గొంతులో హలాహలం ఉందని, నాకే కరోనా టెస్ట్ చేస్తారా అంటూ పిచ్చి పిచ్చిగా అరిచింది.

తల్లికి అలేఖ్యకు దగ్గర పోలికలు..ఎవరు ఎవరిని ప్రభావితం చేశారు?!!
దీన్ని బట్టి.. తల్లి పద్మజ, పెద్ద కూతురు అలేఖ్య ఆలోచనలు చాలా దగ్గరగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తల కొప్పు విషయంలో గాని, అలేఖ్య పోస్టులో రాసిన హలాహలం, పద్మజ తన గొంతులో హలాహలం ఉందని చెప్పిన విషయాలను బట్టి ఇద్దరిలోనూ చాలా పోలికలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆధ్యాత్మికత విషయంలో తల్లి పద్మజ.. కూతురు అలేఖ్యను ప్రభావితం చేసిందా.. లేక విపరీత మనస్తత్వం ఉన్న అలేఖ్యనే.. తల్లిని ప్రభావితం చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ కేసులో ఇంకెన్ని వింత విచిత్రమైన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది.