SI Died: చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి

చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి (35) మృతి చెందారు. శనివారం కానిస్టేబుల్ రవీంద్రతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన శ్రావణి బుధవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

SI Died: చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి

Si Died

SI Died: గుంటూరు జిల్లా చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి (35) మృతి చెందారు. శనివారం కానిస్టేబుల్ రవీంద్రతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన శ్రావణి బుధవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శ్రావణి 2018 లో ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యారు. ట్రైనింగ్ అనంతరం నరసారావుపేటలోని దిశ పోలీస్ స్టేషన్ లో తోలి పోస్టింగ్ వచ్చింది.

కొద్దీ నెలల తర్వాత చుండూరుకు మార్చారు. గత ఏడూ నెలలుగా చుండూరు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నారు శ్రావణి.. ఈ నేపథ్యంలోనే శనివారం కానిస్టేబుల్ తో కలిసి ఆత్మహత్యకు యత్నించారు. వీరిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందగా రవీందర్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.