ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన సినీ నిర్మాత

  • Published By: murthy ,Published On : August 28, 2020 / 11:13 PM IST
ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన సినీ నిర్మాత

ఆంధ్రప్రదేశ్ లోని  తూర్పు గోదావరి జిల్లా  సీతానగరంలో దళిత యువకుడి శిరోముండనం ఘటన మరువక ముందే విశాఖ జిల్లా పెందుర్తిలో శుక్రవారం మరో ఘటన చోటు చేసుకుంది.

సుజాతనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పర్రి శ్రీకాంత్ అనే ఎస్సీ యువకుడు అదే కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాథ ఎన్.నూతన్ నాయుడు ఇంట్లో 3 నెలల క్రితం పనికి కుదిరాడు . 2 నెలలు పని చేసి…. నెల రోజుల క్రితం మానేశాడు. ఆవిషయం దృష్టిలో పెట్టుకుని సెల్ ఫోన్ చోరి చేసాడని నూతన్ నాయుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఆ విషయమై మట్లాడాలని ఇంటికి పిలిచారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీకాంత్ నూతన్ నాయుడు ఇంటికి వెళ్లాడు. అక్కడ వారి మిగతా సిబ్బంది అంతా చూస్తుండగానే నూతన్ నాయుడు భార్య శ్రీకాంత్ కు గుండు గీయించారు.

అనంతరం సిబ్బంది శ్రీకాంత్ పై దాడి చేశారు. ఈవిషయం బయటఎక్కడైనా చెపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నూతన్ నాయుడు భార్య బెదిరించింది.ఈవిషయం మీడియా ద్వారా బయటకు రావటంతో పెందుర్తి పోలీసులు బాధిత యువకుడిని స్టేషన్ కు తీసుకు వచ్చి విచారిస్తున్నారు.