నామినేషన్ల ఉపసంహరణ సమయం కంటే ముందే ఆఫీస్ గేట్లు మూసివేత
Municipal Corporation officials Enthusiasm : విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సమయం కంటే ముందే కార్యాలయం గేట్లను మూసివేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ముందే గేట్లు మూసివేయడంతో నామినేషన్ల ఉపసంహరణ కోసం వచ్చిన అభ్యర్థులు అవస్థలు పడ్డారు.
మూసివేసిన గేట్ల ముందు అభ్యర్థులు నిరీక్షించారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. బరిలో ఉండిపోతానని అభ్యర్థి హెచ్చరించారు. గేట్లు తీసేదిలేదని ముందుగా బెట్టు చేసిన అధికారులు.. ఆ తర్వాత తీశారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈనెల 10న 12కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 17వేల 415 నామినేషన్లు దాఖలయ్యాయి. 2వేల 900లకు పైగా నామినేషన్ల ఉపసంహరణ జరిగింది.