CM Jagan Delhi Tour : ఢిల్లీకి సీఎం జగన్..షెడ్యూల్ ఖరారు

ఏపీ సీఎం జగన్ దేశ రాజధాని హస్తినకు వెళుతున్నారు. ఆయన పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జులై 10వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ వెళుతారు.

CM Jagan Delhi Tour : ఢిల్లీకి సీఎం జగన్..షెడ్యూల్ ఖరారు

Cm Jagan Delhi Tour

CM Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్ దేశ రాజధాని హస్తినకు వెళుతున్నారు. ఆయన పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జులై 10వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ వెళుతారు. మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. గురువారం రాత్రి ఢిల్లీలోనే ఉండనున్నారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం విజయవాడకు చేరుకుంటారు. సీఎం జగన్ ఢిల్లీకి వెళుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన సమస్యలపై వారితో చర్చించే అవకాశం ఉంది. రఘురామకృష్ణంరాజు అంశం కేంద్రం దృష్టికి తీసుకెళుతారని సమాచారం. పోలవరం ప్రాజెక్టు రావాల్సిన నిధులు.. దానికి తోడు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తారని తెలుస్తోంది. విభజన హామీలు, వ్యాక్సినేషన్‌పై కూడా సీఎం జగన్ సంబంధిత శాఖల మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. ఇక జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ రద్దుపై కోర్టు విచారణ నేపథ్యంలో ఢిల్లీ టూర్‌కి ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ సర్కార్‌ రాజద్రోహం కేసు, థర్డ్‌ డిగ్రీ ప్రయోగంపై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఎంపీ రఘురామరాజు ఫిర్యాదులు చేశారు. కేంద్రంతో సీఎం జగన్ ఎలా వ్యవహరించబోతున్నారనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read More : India Vs Sri Lanka : శ్రీలంక టూర్.. సారథిగా శిఖర్ ధావన్.. కోచ్‌గా ద్రవిడ్!