మాట తప్పని సీఎం జగన్, ఒక్కొక్కరికి రూ.24వేలు, 6నెలలు ముందే రెండో విడత సాయం

ఏపీలో జగన్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం

  • Published By: naveen ,Published On : June 20, 2020 / 08:16 AM IST
మాట తప్పని సీఎం జగన్, ఒక్కొక్కరికి రూ.24వేలు, 6నెలలు ముందే రెండో విడత సాయం

ఏపీలో జగన్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం

ఏపీలో జగన్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం జగన్ కొన్ని పథకాలు ప్రారంభించగా తాజాగా వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం పథకం రెండో విడత నేడు ప్రారంభించారు. శనివారం(జూన్ 20,2020) ఉదయం క్యాంప్ ఆఫీస్‌లో ఆన్‌లైన్‌ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు సీఎం జగన్. తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడారు. మొత్తం 81వేల 24 మంది చేనేతలకు లబ్ధి చేకూరింది. డిసెంబర్ 21, 2019న‌ ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్… ఆరు నెలల వ్యవధిలోనే రెండో విడత సాయం అందించడం విశేషం. ఈ పథకం కోసం మొత్తం రూ.194.46 కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు చెల్లింపుతో పాటు, కోవిడ్‌ మాస్కులు తయారు చేసిన ఆప్కో సంస్థకు రూ.109 కోట్లు చెల్లించింది ప్రభుత్వం.

6నెలల ముందే రెండో విడత సాయం, ప్రతి నేతన్న ఖాతాలో రూ.24వేలు:
చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న నేత కుటుంబాలకు ఆసరాగా మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేలు నగదు పంపిణీ చేశారు. కరోనా కారణంగా 6 నెలలు ముందుగానే ప్రభుత్వం సాయం అందించింది. వాస్తవానికి డిసెంబర్ 21న ఇవ్వాల్సిన ఆర్థిక సాయాన్ని ఆరు నెలల ముందుగానే ఇచ్చారు. పవర్‌ లూమ్స్‌ రావడం వల్ల చాలా మంది చేనేతలు ఆర్థికంగా ముందుకు సాగలేకపోయారు. కేవలం మగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న వారికి ప్రభుత్వం ఏడాదికి రూ.24వేలు ఆర్థిక సాయం అందించి ముడి సరుకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకునే విధంగా సాయపడుతోంది.

* కార్యక్రమానికి వచ్చిన చేనేత కార్మికులను పరిచయం చేసుకున్న సీఎం జగన్‌
* చేనేతలకు మంచి చేయాలనే తలంపుతో కరోనా కష్ట సమయంలో వారిని ఆదుకునేందుకు నేతన్న నేస్తం ఇస్తున్నాం
* గతేడాది నేతన్న నేస్తాన్ని మొదలుపెట్టాం
* ఆరు నెలలు తిరక్కముందే ఈ కార్యక్రమం కింద మళ్లీ చేనేతలను ఆదుకుంటున్నాం
* గత ఏడాది నా పుట్టిన రోజున డిసెంబర్‌ 21న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం
* మళ్లీ ఈ ఏడాది డిసెంబర్‌ 21నే ఇద్దామని అనుకున్నాం
* కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి, అంతవరకూ వేచి చూడ్డం ఇష్టంలేక ఇప్పడే ఇస్తున్నాం
* మార్కెట్లు లేక, రవాణా లేక, ముడిసరుకుల ధరలు పెరగడం, కొత్త టెక్నాలజీలతో యద్ధం చేస్తున్న పరిస్థితుల్లో చేనేతల కష్టాలు చూస్తున్నాం
* నా పాదయాత్రలో చేనేతల కష్టాలను చాలా దగ్గరగా చూశాను
* వారందరికీ తోడుగా ఉంటానని వారికి మాట ఇచ్చాను
* ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కొ ప్రఖ్యాతగాంచిన చేనేత పరిశ్రమ ఉన్నా కూడా, మార్కెటింగ్‌ సరిగా లేక, ముడిసరుకుల ధరలు ఎక్కువగా ఉండడం, ఎలా బతకాలో అర్థంకాని పరిస్థితి వారిది

* నా పాదయాత్రలో ఈ కష్టాలన్నింటినీ చూశాను
* మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.24వేలు ఇస్తామని చెప్పాం
* ఈ మాట నెరవేరుస్తూ వైయస్సార్‌ నేతన్న నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం
* దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదాలతో అడుగు ముందుకు వేస్తున్నాం
* గడచిన ఐదేళ్లలో, గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు ఎంత ఇచ్చారంటే.. కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి
* అలాంటిది ఈ 13 నెలల కాలంలోనే ఇదే చేనేతలకు ఎంత ఇస్తున్నామో చూడండి
* గత ఏడాది వైయస్సార్‌ నేతన్న నేస్తం కింద రూ.200 కోట్లు సుమారుగా ఇస్తే.. ఇవాళ రూ. 406 కోట్లకు పైగా ఇస్తున్నాం
* ఆప్కోకు గత ప్రభుత్వం పెట్టిన రూ.103 కోట్లతో పాటు, రెండో ఏడాది వైయస్సార్‌ నేతన్న నేస్తం కోసం మరో రూ.200 కోట్లు సుమారుగా ఇస్తున్నాం

* కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆప్కో నుంచి బట్ట మాస్కుల తయారీకి కొన్నాం. దీని కోసం రూ. 109 కోట్లు ఇవాళే ఇస్తున్నాం
* ఎలాంటి బకాయిలు పెట్టకుండా వెంటనే ఈ డబ్బు ఇస్తున్నాం
* ఈ 13 నెలల కాలంలో పేదవాడికి మంచి జరగాలని ఆరాటపడ్డాం
* అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసిన పథకాలు చూస్తే.. నేనే ఆ పేర్లు మిస్‌ అవుతానేమో అనిపిస్తుంది
* రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు సుమారు రూ.60లక్షల మందికి ఇస్తున్నాం
* పేదవాడి బతుకులు మార్చే విధంగా ఇంగ్లీషు మీడియం తెస్తున్నాం
* ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇస్తూ నామినేషన్‌ పనుల్లో, పదవుల్లో చట్టాలు తెచ్చాం
* కేబినెట్ లో ఏకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60శాతం మంత్రి పదవులు ఇచ్చాం
* ఐదుగురు డిప్యూటీ సీఎం పదవుల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం
* 3.89 కోట్ల మందికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.40వేల కోట్లకుపైగా ఇచ్చాం
* ఎలాంటి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా.. వారి చేతికే ఇవ్వగలుగుతున్నాం
* గ్రామ స్థాయి నుంచి గొప్ప మార్పులు తీసుకు రాగలిగాం
* ఈ 13 నెలలో ఇవన్నీ చేయగలిగాం అంటే దేవుడి దయ, మీ అందరి దీవెనల వల్లే సాధ్యమైంది
* లబ్ధిదారుల జాబితా, ఎంపికకు సంబంధించి దాదాపు 80వేల కుటుంబాలకు ఇవాళ మంచి జరుగుతుంది
* ప్రతి ఒక్కరికీ రూ.24వేలు ఇవ్వగలుగుతున్నాం

* గ్రామ వాలంటీర్లు సర్వే చేసి, లబ్ధిదారులను గుర్తించి, గ్రామ సచివాలయంలో సామాజిక తనిఖీ కోసం జాబితాను పెట్టాం
* ఒకవేళ జాబితాలో పేరు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలో వివరాలు కూడా అక్కడ పెట్టాం
* ఇంకా నెలరోజుల సమయం ఉంది
* ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే తపించే ప్రభుత్వం మనది
* ఎలా పథకాన్ని ఎగరగొట్టాలనే ఆలోచన చేసే ప్రభుత్వం మనది కాదు
* అర్హత ఉండి.. మీ పేరు జాబితాలో లేకపోతే గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి
* వెంటనే పరిశీలించి… మళ్లీ వచ్చే నెల ఈ తేదీలోగా మిగిలిపోయిన వారు ఉంటే.. వారిక్కూడా మంచి చేస్తాం
* 1902 నెంబర్ కి కాల్‌ చేసి పేరు నమోదు చేసుకోవచ్చు

Read: వైఎస్ఆర్ పెన్షన్ కానుక : మేలో వచ్చిన దరఖాస్తులు..మంజూరు వివరాలు