రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలి, ముస్లింలకు సీఎం జగన్ విజ్ఞప్తి

ఏపీలోని ముస్లింలకు సీఎం జగన్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని కోరారు. తద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి

  • Published By: veegamteam ,Published On : April 20, 2020 / 09:52 AM IST
రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలి, ముస్లింలకు సీఎం జగన్ విజ్ఞప్తి

ఏపీలోని ముస్లింలకు సీఎం జగన్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని కోరారు. తద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి

ఏపీలోని ముస్లింలకు సీఎం జగన్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని కోరారు. తద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో సీఎం జగన్ సోమవారం(ఏప్రిల్ 20,2020) వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు.

ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు: 
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కొన్ని రోజులుగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని సీఎం చెప్పారు. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ ఇళ్లల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ఇప్పుడు రంజాన్‌ ను కూడా అలానే జరుపుకోవాలన్నారు. ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ రంజాన్‌ మాసంలో ముస్లింలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పండంటూ ముస్లిం మత పెద్దలకు సీఎం విజ్ఞప్తి  చేశారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా ప్రజల సంక్షేమం కోసం చెప్పక తప్పని పరిస్థితి అని సీఎం జగన్ అన్నారు.

ప్రతీ మసీదు, చర్చి, గుడికి రూ.5వేలు:
కష్టాల్లో ఉన్నా.. చేయాల్సిన పథకాల విషయంలో ముందడుగు వేస్తున్నామన్నారు. కరోనా లాంటి ఇబ్బందికర సమయాల్లో కూడా గతంలో కవర్‌ అయిన ప్రతి మసీదుకు సంబంధించి రంజాన్‌ నాటిని పూర్తి బకాయిలు చెల్లిస్తామన్నారు. కవర్‌ కాని మసీదుల కూడా రూ.5వేలు గ్రామ వాలంటీర్‌ ద్వారా చెల్లిస్తామన్నారు. అలాగే ప్రతి చర్చికీ, గుడికీ రూ.5 వేలు ఇవ్వమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీది.. మన అందరిది అని జగన్ చెప్పారు.

కుల,మత, ప్రాంతాలకు అతీతంగా అందరికీ పథకాలు:
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కులం, మతం, ప్రాంతం, రాజకీయానికి అతీతంగా అందరికీ పథకాలు ఇవ్వగలుగుతున్నామని సీఎం జగన్ చెప్పారు. కొత్త పథకాలు కూడా అమలు చేశామన్నారు. ప్రతి నెలా ఒక కొత్త కార్యక్రమంతో ప్రజలకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి పథకాలు తీసుకురావడంతో పాటు పెన్షన్లు రూ. 2,250 వరకూ తీసుకెళ్లామని గుర్తు చేశారు. మీ అందరికీ కనిపించేలా పనులు చేయగలుగుతున్నామన్నారు. ఏప్రిల్ లో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు రూ.150 కోట్ల మేర రావాల్సిన ఆదాయం రానప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకూడదని ఎక్కడా లేని విధంగా అడుగులు వేశామన్నారు. ప్రతి పేద కుటుంబానికీ రూ.1500 ఇచ్చామన్నారు. నెలకు 3సార్లు రేషన్‌ ఇస్తున్నామని చెప్పారు. 

ఆర్థిక ఇబ్బందుల్లో సున్నా వడ్డీ, ఫీజు రీయింబర్స్ మెంట్:
రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా వైద్యం కోసం, ఇతరత్రా అంశాల కోసం ఖర్చులు బాగా పెరిగినా ప్రజలకు ఇబ్బందులు రాకూడదని, కష్టాలు ఉన్నప్పటికీ చిరునవ్వుతో అడుగులు ముందుకేస్తున్నామని జగన్ చెప్పారు. పొదుపు సంఘాల్లోని మహిళలకు ఏప్రిల్ 24న సున్నా వడ్డీ కార్యక్రమానికి రూ.1400 కోట్లు ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. ప్రతి పేదవాడికీ చదువు చెప్పించే కార్యక్రమంలో భాగంగా.. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కోసం ఏప్రిల్ నెలలో రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా గత ప్రభుత్వం పెట్టిన రూ.1800 కోట్లు చెల్లించామన్నారు. 2020 మార్చి 31 వరకూ ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లి అక్కౌంట్లోకి నేరుగా డబ్బు చెల్లిస్తామన్నారు. ఆ డబ్బును తల్లి నేరుగా కాలేజీలకు కడుతుందన్నారు.