CM Jagan letters : వైసీపీ అభ్యర్థిని గెలిపించండి : తిరుపతి లోక్‌సభ పరిధిలోని కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో సంక్షేమపథకాలు అందుకుంటున్న కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు రాశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా కుటుంబాలకు అందిన వివిధ పథకాల వివరాలను సీఎం లేఖలో పేర్కొన్నారు.

CM Jagan letters : వైసీపీ అభ్యర్థిని గెలిపించండి : తిరుపతి లోక్‌సభ పరిధిలోని కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు

Cm Jagan Letters

CM Jagan’s letters to families in Tirupati Lok Sabha constituency : తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో సంక్షేమపథకాలు అందుకుంటున్న కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు రాశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా కుటుంబాలకు అందిన వివిధ పథకాల వివరాలను సీఎం లేఖలో పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల ద్వారా కలిగిన లబ్ధిని గుర్తు చేశారు. తిరుపతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ఉప ఎన్నికలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని లేఖలో పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై సీఎం జగన్ సంతకం చేశారు. అయితే ఈ లేఖలో ప్రతిపక్ష పార్టీలపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కేవలం తన 22నెలల పాలనాకాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి.. తదితర అంశాలను మాత్రమే పేర్కొన్నారు.

మరోవైపు తిరుపతిలో బైపోల్‌ వార్‌ హీటెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఈ నెల 14వ తేదీన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. రేణిగుంట సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. అయితే పూర్తి స్థాయిలో పర్యటన షెడ్యూల్‌ ఇంకా ఖరారు కానట్లు తెలుస్తోంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 17న జరుగనుండగా.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి భారీ మెజార్టీ లక్ష్యంగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

సీఎం జగన్‌ కూడా తిరుపతిలో పర్యటిస్తే.. రికార్డు స్థాయిలో మెజార్టీ వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పార్టీ నేతలు పెద్దలు రేణిగుంట మండలం ఎల్లమండ్యంలోని యోగానంద కళాశాల సమీపంలో బహిరంగ సభకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి తిరుపతి ప్రచారానికి రూట్‌ మ్యాప్‌పై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ సమర శంఖారావం మొదటి సభ కూడా ఈ ప్రాంగణంలోనే చేపట్టడంతో పార్టీ నేతలు ఈ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.