CM Jagan : ముందు ఎర్రజెండా, వెనుక పచ్చజెండా అజెండా- టీచర్ల ఆందోళనపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఉపాధ్యాయులను ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయని జగన్ ఆరోపించారు. టీచర్లు పోరుబాట పట్టడం మంచిది కాదన్నారు.

CM Jagan : ముందు ఎర్రజెండా, వెనుక పచ్చజెండా అజెండా- టీచర్ల ఆందోళనపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Cm Jagan

CM Jagan : జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల సందర్భంగా ఉపాధ్యాయుల ఆందోళనలపై సీఎం జగన్ స్పందించారు. విపక్షాలపై ఆయన ఫైర్ అయ్యారు. ఉపాధ్యాయులను ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయని జగన్ ఆరోపించారు. టీచర్లు పోరుబాట పట్టడం మంచిది కాదన్నారు. ఉద్యోగులు సమ్మె విరమించడం వాళ్లకు నచ్చలేదన్న జగన్.. అందుకే పచ్చజెండా ముసుగులో ఉన్న ఎర్రజెండా సోదరులను ముందుకు తోశారని మండిపడ్డారు. ”ముందు ఎర్రజెండా, వెనుక పచ్చజెండా అజెండా… ఇదీ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి” అని జగన్ ఘాటు విమర్శలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరని జగన్ అన్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ప్రజలు కూడా కోరుకోరని చెప్పారు. ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్న ఏ ఒక్క కుటుంబం కూడా ఉద్యోగులు సమ్మె చేయాలని కోరుకోదని స్పష్టం చేశారు. “మరి సమ్మె జరగాలని ఎవరు కోరుకుంటారో తెలుసా? ఆందోళనలు ఎవరికి కావాలో తెలుసా?… ఎవరికి కావాలంటే… చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ, కడుపుమంట ఉన్నవారికి మాత్రమే సమ్మె జరగడం కావాలి.

Safer Internet Day 2022: ఆన్‌లైన్‌లో మీ పిల్లలు జాగ్రత్త.. సేఫ్‌గా ఉంచేందుకు 5మార్గాలు ఇవే!

పార్టీల పరంగా చూస్తే… ఎర్రజెండాల వారికి సమ్మె జరగడం కావాలి, బాబు దత్తపుత్రుడికి సమ్మె జరగడం కావాలి. వ్యక్తుల పరంగా చూస్తే… మీడియా ముసుగులో నడుస్తున్న సంస్థల వాళ్లకు సమ్మె జరగడం కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతోందంటే వీళ్లకు పండుగ. ప్రభుత్వంతో సంధి జరిగి ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదని తెలియడంతో వీళ్లంతా ఏడుపు ముఖం పెట్టారు. సమ్మె విరమించడం వాళ్లకు నచ్చలేదు” అని జగన్ అన్నారు.

”ఉద్యోగులతో చర్చల వేళ ఉపాధ్యాయులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. కేవలం కొన్ని సంఘాలు మాత్రమే అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కరోనా వల్ల రెండేళ్లుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం లేదు. మూడో సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి రావాలని కోరుకోవడం లేదు. ఉపాధ్యాయులు పోరుబాట పట్టడం మంచిది కాదు. ఉపాధ్యాయులు ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి” అని జగన్ అన్నారు.

Snacks : చిరుతిళ్లతో రోజంతా గడిపేస్తున్నారా?…

ఏపీలో పీఆర్సీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. పైగా ఉద్యోగ సంఘాల్లో చీలక కూడా తెచ్చింది. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించకుండానే ప్రభుత్వ ప్రతిపాదనలకు స్టీరింగ్ కమిటీ ఎలా అంగీకారం చెబుతుంది? అంటూ.. ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు స్టీరింగ్ కమిటీ నుంచి బయటకొచ్చాయి.

స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రభుత్వంతో చీకటి ఒప్పందం చేసుకుని.. తమకు తీరని అన్యాయం చేశారని కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ సంఘాలు, టీచర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. పీఆర్సీపై తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.