AP Covid 19 : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

AP Covid 19 : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona Cases Greatly Reduced In Ap 4

Corona Cases AP : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

51 వేల 204 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 452మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 08 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,171 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 18,59,141 పాజిటివ్ కేసులకు గాను, 17,95,485 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-
చిత్తూరులో ఎనిమిది మంది, తూర్పు గోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విశాఖపట్టణంలో ఇద్దరు, గుంటూరులో ఒకరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 236. చిత్తూరు 493. ఈస్ట్ గోదావరి 1171. గుంటూరు 289. వైఎస్ఆర్ కడప 296. కృష్ణా 355. కర్నూలు 73. నెల్లూరు 306. ప్రకాశం 307. శ్రీకాకుళం 174. విశాఖపట్టణం 173. విజయనగరం 151. వెస్ట్ గోదావరి 660. మొత్తం : 4,684