ఏపీలో కరోనా : తగ్గుతున్న కేసులు

  • Published By: madhu ,Published On : October 5, 2020 / 06:53 PM IST
ఏపీలో కరోనా : తగ్గుతున్న కేసులు

Corona Cases in AP  : ఏపీలో కరోనా కేసులు (Corona Cases) నమోదవుతూనే ఉన్నాయి. రోజు రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డువుతన్నాయి. తాజాగా 24 గంటల్లో 4 వేల 256 కేసులు నమోదు కాగా..7 వేల 558 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.



56 వేల 145 శాంపిల్స్ పరీక్షించినట్లు, కృష్ణలో ఏడుగురు, చిత్తూరులో ఐదుగురు, కడపలో ఐదుగురు, అనంతలో నలుగురు, విశాఖలో నలుగురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇధ్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు మరణించారని వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 61, 50, 351 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.



జిల్లాల వారీగా..
అనంతపురం 271. చిత్తూరు 224. ఈస్ట్ గోదావరి 853. గుంటూరు 444. కడప 231. కృష్ణా 179. కర్నూలు 86. నెల్లూరులో 365. ప్రకాశం 666. శ్రీకాకుళం 157. విశాఖ 138. విజయనగరం 129. వెస్ట్ గోదావరి 513. మొత్తం 4256.



రాష్ట్రాల్లో శాంపిల్స్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ 61,50,351. తమిళనాడు 77,00,011. కేరళ 31,64,072. తెలంగాణ 32,05,249. కర్నాటక 52,60,160. గుజరాత్ 46,45,263. మహారాష్ట్ర 71,11,204. రాజస్థాన్ 32,07,733. మధ్యప్రదేశ్ 22,08,006. ఇండియాలో 7,99,82,394