Corona Cases In AP : ఏపీలో కరోనా..24 గంటల్లో 5 వేల 963 కేసులు, 27 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 963 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Corona Cases In AP : ఏపీలో కరోనా..24 గంటల్లో 5 వేల 963 కేసులు, 27 మంది మృతి

Corona Danger Bells

COVID-19 : ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 5 వేల 963 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 37 వేల 765 శాంపిల్స్ పరీక్షించారు. కృష్ణాలో ఆరుగురు, చిత్తూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్టణంలో ఇద్దరు చొప్పున, అనంతపూర్ లో ఒక్కరు మరణించారు.

గడిచిన 24 గంటల్లో 2 వేల 569 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 1,57,15,757 శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 9 లక్షల 65 వేల 105 పాజిటివ్ కేసులకు గాను..9 లక్షల 09 వేల 615 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఈ వైరస్ కారణంగా…7 వేల 437 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 48 వేల 053గా ఉంది.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 156. చిత్తూరు 1182. ఈస్ట్ గోదావరి 626. గుంటూరు 938. వైఎస్ఆర్ కడప 189. కృష్ణా 171. కర్నూలు 434. నెల్లూరు 491. ప్రకాశం 280. శ్రీకాకుళం 893. విశాఖపట్టణం 565. విజయనగరం 19. వెస్ట్ గోదావరి 19. మొత్తం : 5963

Read More : Sputnik-V Vaccine : భారత్‌లోకి మరో వ్యాక్సిన్..