Corona Telugu states : తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఏపీలో 758, తెలంగాణాలో 493

ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

Corona Telugu states : తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఏపీలో 758, తెలంగాణాలో 493

Corona Telugu states

ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 758 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి నలుగురు మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరులో 175, గుంటూరులో 127 కరోనా కేసులు వెలుగు చూశాయి.

14వ తేదీ 298
15వ తేదీ 147
16వ తేదీ 261
17వ తేదీ 253
18వ తేదీ 218
19వ తేదీ 246
20వ తేదీ 380
21వ తేదీ 368
22వ తేదీ 310
23వ తేదీ 492
24వ తేదీ 585
25వ తేదీ 758

మరోవైపు…
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో తాజాగా 493 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో ఇన్ని ఎక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా కరోనా బారినపడి నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 16వందల 80కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 3వేల 684 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇందులో 16 వందల 16మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో పరిస్థితి ఎలా ఉందంటూ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ను పలువురు ఎమ్మెల్యేలు ఆరా తీశారు. దీంతో ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు మంత్రి ఈటల. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్‌, డీపీహెచ్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌తో మాట్లాడారు. కరోనా వ్యాప్తి, బాధితులకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. అటు ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్య సంఘం ప్రతినిధులతోనూ మంత్రి ఈటల మాట్లాడారు.
రాష్ట్రంలో కొత్తగా 493 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో నలుగురు మృతిచెందారు. దీంతో కరోనా బాధితులకు సకాలంలో చికిత్స అందించాలని కోరారు మంత్రి ఈటల. వైద్య చికిత్స అందివ్వడంలో ఎలాంటి ఇక్కట్లు లేకుండా చూడాలని ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

వైరస్‌ వ్యాప్తితో ఆసుపత్రుల్లో చేరుతున్న ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరిగింది కానీ.. మరీ అంత తీవ్రత లేదని మంత్రికి వివరించారు సంబంధిత శాఖాధికారులు. అయితే కరోనా కట్టడికి టెస్ట్‌లను పెంచాలని అధికారులకు మంత్రి సూచించారు. కరోనా బాధితుల్లో వైరస్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.