Covid-19: ఒకే మంచంపై మృతదేహం, కరోనా బాధితుడు

కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో దేశంలోని చాలా ఆసుపత్రులలో బెడ్లు నిండుకున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో బెడ్డుపై ఇద్దరినీ ఉంచి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ప్రజలను బ్రతికించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఒకే బెడ్డుపై ఇద్దరు కరోనా బాధితులను ఉంచారు.

Covid-19: ఒకే మంచంపై మృతదేహం, కరోనా బాధితుడు

Covid 19 (2)

Covid-19: కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో దేశంలోని చాలా ఆసుపత్రులలో బెడ్లు నిండుకున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో బెడ్డుపై ఇద్దరినీ ఉంచి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ప్రజలను బ్రతికించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఒకే బెడ్డుపై ఇద్దరు కరోనా బాధితులను ఉంచారు.

వీరిద్దరూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్ పెట్టారు వైద్యులు.. కొద్దీ సేపటి తర్వాత బెడ్డుపై ఉన్న ఇద్దరిలో సుంకన్న అనే వృద్ధుడు మృతి చెందాడు. ఆసుపత్రి సిబ్బంది బిజీగా ఉండటంతో మృతదేహాన్ని బెడ్డుపైనే ఉంచారు. దీంతో రెండు గంటలపాటు కరోనా బాధితుడు, మృతదేహం పక్కనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. యువకుడి దయనీయ దుస్థితి చూసిన కొందరు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.