AP Covid-19 : ఏపీలో కొత్తగా 20 వేలకు చేరువలో కోవిడ్ కేసులు

AP Covid-19 : ఏపీలో కొత్తగా 20 వేలకు చేరువలో కోవిడ్ కేసులు

Ap New Covid Cases

AP Covid-19 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంట్లలో 19,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,59,165 కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది.

ఏపీలో కరోనా సోకి  ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య  10 వేలు దాటింది. నిన్న ఒక్కరోజే 118 మంది కరోనా తో మరణించారు. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 15 మంది మరణించగా… వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా తో మరణించిన వారి సంఖ్య 10,022 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 2,10, 683 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది. గడిచిన 24 గంటల్లో 18,336 మంది కోవిడ్ కి చికిత్స పొంది.. కోలుకుని ఇళ్లకు వెళ్ళారు. ఇంతవరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 13,38,460 కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో నిన్న 90,609 శాంపిల్స్ ను పరీక్షించారు. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 1,85,25,758 కి చేరింది.