విశాఖలో క్రేన్ ప్రమాదం…ఆరుగురి మృతి
విశాఖ పట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్ కూలి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వారిని ఆస్పత్రికి త రలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్రేన్ కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. క్రేన్ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఘటనా స్దలానికి చేరుకున్ పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు.
షిప్యార్డులో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరా తీశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవోకు ఫోన్ ద్వారా సూచించారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్దరక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యలు చేపట్టారు..