ఏపీలో TV ఛానల్ ద్వారా పాఠాలు..ఏ ఛానల్ లో తెలుసా
ఏపీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు నష్టం కలగకుండా, విద్యా బోధనకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు 2020, జూన్ 10వ తేదీ నుంచి టీవీ ఛానల్ ద్వారా పాఠాలు బోధించనున్నారు. 1 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 5 తరగతులకు బ్రిడ్జి కోర్సు, 6 నుంచి 9 తరగతులకు సబ్జెక్టు పాఠాలను బోధిస్తారు. విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు టీచర్లు వారానికోసారి స్కూల్కు వస్తారు. ఆన్లైన్ పాఠాలపై విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే ఆ రోజుల్లో స్కూల్కి వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. అంతేకాదు.. 5వ తరగతి వరకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రిడ్జి కోర్సు పుస్తకాలను అందిస్తారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, తెలుగు సబ్జెక్టులను ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు.
1, 2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటలు.
3, 4, 5 తరగతులకు 11.30 గంటల నుంచి 12 గంటల వరకు.
6 నుంచి 9 తరగతులకు అన్ని సబ్జెక్టులు చెబుతారు.
6, 7 తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు.
8, 9 తరగతులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
1- నుంచి 5 క్లాసెస్ చెప్పే వారు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరు కావాలి.
6 నుంచి 7 తరగతుల HM టీచర్స్ 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలకు వెళ్లాలి.
8 నుంచి 9 తరగతులకు పాఠాలు చెప్పే టీచర్స్ 19 నుంచి ప్రతి శుక్రవారం హాజరు కావాలి.
10వ తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది.