దారుణం : డిగ్రీ విద్యార్ధినిని కాళ్లు చేతులు కట్టేసి తోటలో పడేశారు

దారుణం : డిగ్రీ విద్యార్ధినిని కాళ్లు చేతులు కట్టేసి తోటలో పడేశారు

degree girl tied and leaves open place in vizianagaram district : విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ చదివే విద్యార్దినిని కాళ్లు, చేతులు కట్టేసి తోటలో పడేశారు దుండగులు. తెర్లాం పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న తోటలో అపస్మారకస్ధితిలో పడి ఉన్న బాలికను సోమవారం ఉదయం గుర్తించిన స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు బాలికకు ఉన్న కట్లు విప్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాలిక అపస్మారక స్ధితలోనే ఉన్నది. బాలిక తెర్లాం మండలం లోని చర్ల గ్రామానికి చెందిన రమ గా గుర్తించారు. బాలికను ఆస్పత్రిలో  చేర్చిన విషయం ఆమె తల్లి తండ్రులకు చేరవేశారు.

బాధితురాలు రమ విజయనగరంలోని ఎస్.కే. డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఆదివారం రాత్రి దుండగులు ఆమె కాళ్లు చేతులు కట్టి అక్కడపడేసి వెళ్ళినట్లుగా పోలీసులు  గుర్తించారు. బాలిక స్పృహలోకి వస్తే గానీ ఏమైంది అనే సంగతి తెలియదు. బాలికను ఎవరు కిడ్నాప్ చేశారు… ఎక్కడ చేశారు… అక్కడికి ఎలా వచ్చింది.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.