పెళ్ళికి నో అన్న దేవరాజ్…శ్రావణి సూసైడ్

  • Published By: murthy ,Published On : September 14, 2020 / 08:02 AM IST
పెళ్ళికి నో అన్న దేవరాజ్…శ్రావణి సూసైడ్

టీవీనటి శ్రావణి సూసైడ్ కేసులో ఎస్సార్ నగర్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. శ్రావణిని పెళ్లి చేసుకోటానికి దేవరాజ్ రెడ్డి నిరాకరిచంటంతోనే  తీవ్ర మానసిక ఒత్తిడికి గురై శ్రావణి ఆత్మహత్యే చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణా రెడ్డిలను గత 3 రోజులుగా వివిధ కోణాల్ల్లో విడి ,విడిగా విచారించిన పోలీసులు ఆదివారం వారిద్దరినీ కలిపి విచారించారు. వారిద్దరి మధ్య గొడవకు కారణమైన అంశాలపైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

శ్రావణికి మొదట సాయి కృష్ణా రెడ్డి తో పరిచయం ఏర్పడింది. అతని ద్వారా సినిమాల్లో ఛాన్స్ లు, అనంతరం టీవీ సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. అయితే శ్రావణికి ఏడాది క్రితం దేవరాజ్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అప్పటి నుంచి శ్రావణి సాయి ని దూరం పెట్టసాగింది.



ఇది జీర్ణించుకోలేని సాయి కుటుంబ సభ్యుల ద్వారా పెళ్ళి ప్రపోజల్ తెచ్చాడు. దీనికి శ్రావణి అంగీకరించకపోవటంతో గొడవ మొదలయ్యింది. మరో వైపు దేవరాజ్ రెడ్డితో ప్రేమలో పడిన శ్రావణి దేవరాజ్ రెడ్డిని పెళ్లి చేసుకోమని కోరింది. ఇటీవలి కాలంలో సాయి కారణంగా గొడవలు రావటంతో…. దేవరాజ్ పెళ్లికి నో అన్నాడు. ఇదే విషయాన్ని ఆమె మొబైల్ కు మెసేజ్ పంపించాడు.
https://10tv.in/sai-and-sravani-family-face-police-investigation-sunday-at-hyderabad/
దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. శ్రావణి తల్లితండ్రులనుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నారు. సోమవారం ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిని విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. దేవరాజ్ , సాయికృష్ణ లు పోలీసుల అదుపులోనే ఉన్నారు.