తిరుమల బస్సుల్లో సీట్ల కోసం తోపులాట

లాక్ డౌన్ 5వ దశలో కేంద్రం సడలింపులతో దాదాపు 80 రోజుల తర్వాత(మార్చి 20) తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు

  • Published By: naveen ,Published On : June 8, 2020 / 05:30 AM IST
తిరుమల బస్సుల్లో సీట్ల కోసం తోపులాట

లాక్ డౌన్ 5వ దశలో కేంద్రం సడలింపులతో దాదాపు 80 రోజుల తర్వాత(మార్చి 20) తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు

లాక్ డౌన్ 5వ దశలో కేంద్రం సడలింపులతో దాదాపు 80 రోజుల తర్వాత(మార్చి 20) తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు ఇవాళ్టి (జూన్ 8, 2020) నుంచి ప్రయోగాత్మకంగా వెంకన్న దర్శనం మొదలైంది. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తలు అమలు చేస్తూ ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి టీటీడీ ఉద్యోగులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించారు అధికారులు. మాస్క్ లు ధరించి వచ్చిన భక్తులు క్యూలైన్లలో భౌతికదూరం పాటిస్తున్నారు. సుమారు రెండున్నర నెలల తర్వాత తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో సోమవారం ఉదయం 6.30 నుంచి భక్తులకు దర్శనమిచ్చాడు వెంకన్న.

సరిపడ బస్సులు వేయలేదని ఆగ్రహం:
కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తొలి రెండు రోజుల పాటు దర్శనాల ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రోజులు టీటీడీ ఉద్యోగులకు, 10వ తేదీన స్థానికులకు, 11వ తేదీ నుంచి భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, తొలి రోజు కొండకు వెళ్లేందుకు వేసిన బస్సులు సరిపోలేదు. దీంతో సీటు కోసం భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అధికారుల తీరుపై టీటీడీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపైకి సరిపడ బస్సులు వేయలేదని మండిపడ్డారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది.

గంటకు 500 మంది చొప్పున, రోజుకు 6 వేల మందికి దర్శనం:
ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 వరకు దర్శనాలకు ఏర్పాట్లు చేసింది టీటీడీ. గంటకు 500 మంది చొప్పున, రోజుకు 6 వేల మందికి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. 3 వేల మందికి ప్రత్యేక దర్శనం, మరో 3 వేల మందికి సాధారణ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. భక్తులు మధ్య భౌతిక దూరం, శుభ్రత పాటించేలా ఏర్పాట్లు చేశారు. దర్శనాలు తిరిగి ప్రారంభమైన వేళ స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూలు పండ్లతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు దర్శనాలు కల్పించేందుకు మార్కింగ్ లైన్స్, భౌతిక దూరాన్ని పాటిస్తూ, నిలబడేందుకు ప్రత్యేక బాక్స్ లు, ఎక్కడికక్కడ శానిటైజర్లు అమర్చారు అధికారులు.

Read: గోవిందా.. గోవిందా: శ్రీవారి దర్శనం మొదలైంది.. తిరుమల గిరుల్లో భక్తుల ఫోటోలు