ధర్మవరం SBI ఉద్యోగినిని చంపింది ఆమె ప్రియుడే

ధర్మవరం SBI ఉద్యోగినిని చంపింది ఆమె ప్రియుడే

SBI employee  killed by her boyfriend : అనంతపురం జిల్లా ధర్మవరంలో SBI ఉద్యోగి స్నేహలత హత్య కేసును పోలీసులు చేధించారు. ఆమె ప్రియుడు రాజేశే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్నేహలతను హత్య చేసినట్లు అతడు విచారణలో అంగీకరించాడు. రాజేశ్‌కు సహకరించిన కార్తీక్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్నేహలత మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందన్న కారణంతోనే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.

ధర్మవరంలో SBI Bankలో కాంటాక్ట్ బేస్ కింద పని చేస్తున్న ఉద్యోగినిని స్నేహలతను దారుణంగా చంపేశారు. హత్య చేసిన అనంతరం ఆ యువతిని దహనం చేశారు. బడనపల్లి పొలాల్లో యువతి హత్యకు గురైందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. హత్య చేసిన అనంతరం గుర్తు పట్టకుండా ఉండేందుకు నిందితులు దహనం చేశారని తెలిపారు. హత్యకు గురైన యువతి..స్నేహలతగా పోలీసులు గుర్తించారు.