Andhra Pradesh : జంబలకిడిపంబ-వరుడి మెడలో తాళి కట్టే వధువు

కొన్నేళ్ల క్రితం వచ్చిన జంబలకిడిపంబ సినిమా తరహాలో వరుడి, మెడలో వధువు తాళికట్టే సన్నివేశం ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. అది ఆ కులస్తుల ఆచారంగా గ్రామ పెద్దలు చెపుతున్నారు. 

Andhra Pradesh : జంబలకిడిపంబ-వరుడి మెడలో తాళి కట్టే వధువు

variety marriage

Andhra Pradesh :  కొన్నేళ్ల క్రితం వచ్చిన జంబలకిడిపంబ సినిమా తరహాలో వరుడి, మెడలో వధువు తాళికట్టే సన్నివేశం ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. అది ఆ కులస్తుల ఆచారంగా గ్రామ పెద్దలు చెపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామంలో గురువారం సామూహిక వివాహాలు జరిగాయి.తరతరాలుగా వస్తున్న ఆ గ్రామస్తులు తమ సాంప్రదాయాన్ని పాటిస్తూ 47 జంటలకు ఒకే ముహూర్తంలో వివాహం చేశారు. ఈ కులస్తుల ఆచారం ప్రకారం వరుడి మెడలో కూడా వధువు తాళి లాంటి వస్తువును కట్టటం విశేషం.

ఒకసారి వారి ఆచారం పరిశీలిస్తే……శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఉన్న నువ్వలరేవు గ్రామానికి వందల సంవత్సరాల క్రితం ఒడిశా నుంచి కేవిటీ కులస్తులు వలస వచ్చారు. వీరంతా చేపల వేటపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వివాహం విషయంలో వీరి పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం వీరు మూడేళ్లకోసారి ఆ గ్రామంలో సామూహిక వివాహాలు నిర్వహిస్తుంటారు.

ఆ ముహూర్తంలో గ్రామంలో ఒకరిని ఒకరు ఇష్టపడి, ఇరు కుటుంబాలు అంగీకరించి, పెళ్ళికి సిద్దంగా ఉన్న యువతీ యువకులకు పెళ్ళి చేస్తారు. మూడు సంవత్సరాలకొకసారి తప్ప మిగిలిన సమయంలో ఆగ్రామంలో పెళ్ళి అనే మాట వినపడదు. ఆ గ్రామంలో ఉండే వారు గ్రామంలో వాళ్ళని మాత్రమే పెళ్ళి చేసుకోవాలి. అదీ కూడా వారి ఆచార వ్యవహారాలు, వారి సాంప్రదాయం ప్రకారమే అంతా జరగాలి. సాధారణ పెళ్ళిళ్ళతో పోలిస్తే వీరి సాంప్రదాయ వివాహాలు కొత్తగా అనిపిస్తాయి. పందిళ్లు వేయటం, రంగులు అలంకరించటం, పెళ్లి పిలుపులు వంటివి కొన్ని కామన్ గా ఉంటాయి. కానీ తాళి కట్టే సమయంలో మాత్రం భిన్నంగా ఉంటుంది వీరి సాంప్రదాయం.

సాధారణంగా మనం చూసే పెళ్ళిళ్ళలో వరుడు మాత్రమే వధువుకు తాళి కడతాడు. వీరి సాంప్రదాయం ప్రకారం మాత్రం వరుడు, వధువుకు తాళి కట్టడంతో పాటు ధాన్యపు గింజ ఆకారంలో ఉండే ధాన్యరచన అనే ఆభరణం వంటి తాళిని వధువు కూడా వరుడికి కడుతుంది. ఈ ధాన్యరచనను పెళ్ళయిన మూడు నెలలలోపు మరల ఆ ఆభరాణాన్ని కరిగించి వధువు మంగళ సూత్రాల్లో దాన్ని కలిపి ధరిస్తారు. నిన్న జరిగిన సామూహిక వివాహాల్లో కూడా వధువులు వరుడికి తాళి కట్టటంతో ఈ వార్త వైరల్ అవుతోంది.
Also Read : Telangana : ‘బారిష్ పూజ’ చేస్తే డబ్బులు పెరుగుతాయి అంటూ బురిడీ.. రూ.12లక్షలతో ఉడాయించిన దొంగ బాబా
పది వేలు జనాభా ఉండే నువ్వలరేవు మేజరు పంచాయతీ లక్ష్మీదేవిపేటగా పేరొందినా నువ్వలరేవుగానే ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామదేవత తులసి బృందావతి. తులసిమాతగా పూజిస్తారు. శ్రీరాముడు వారి ఇలవేల్పు. శ్రీరామనవమి వచ్చిందంటే సంబరాలు అంబరాన్నంటుతాయి. ఊళ్లో చాలా మంది డిగ్రీ చదివినవారు ఉన్నారు. అమ్మాయిలు కనీసం పదోతరగతి వరకు పూర్తి చేశారు. బి.టెక్‌లు చేసినవాళ్లు ఊళ్లొ 15 మంది వరకు ఉంటారు. డిప్లొమోలు చేసి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నా ఈ ఊరి అమ్మాయినే వారు పెళ్లి చేసుకుంటారు.