చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను జైల్లో వేయాలి : ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్ర వ్యాఖ్యలు

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను జైలులో వేయాలన్నారు.

  • Published By: veegamteam ,Published On : January 11, 2020 / 08:10 AM IST
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను జైల్లో వేయాలి : ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్ర వ్యాఖ్యలు

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను జైలులో వేయాలన్నారు.

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను జైలులో వేయాలన్నారు. ఈ మేరకు (శనివారం జనవరి 11, 2020) ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడుతూ చంద్రబాబు తన బినామీల కోసమే బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో బినామీలను బయటకు తేవాలన్నారు. 

జగన్ ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. చంద్రబాబు వారసుడు పప్పు లోకేష్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలన్నారు. 

పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శించారు. చంద్రబాబు చెప్పుచేతుల్లో పవన్ కళ్యాణ్ ఉంటాడని ఎద్దేవా చేశారు. అమరావతిలోని బినామీలను బయటకు తీసి వారిపై కేసులు పెట్టాలని తెలిపారు. తొందరగా రాజధానిని వైజాగ్ కు మార్చాలని జగన్ ను కోరారు.