గుంటూరు జిల్లాలో భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం

గుంటూరు జిల్లాలో భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం

Earthquake in Guntur : గుంటూరు జిల్లాలో భూ కంపం సంభవించింది. రాజధాని ప్రాంతంలో వేకువజామున భూమి కంపించింది. తాడికొండ- తుళ్ళూరు మండల్లాల్లో భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో పరుగుల తీశారు.

తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాలకు భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. తుళ్లూరు, రాయపూడి, నెక్కల్లు, బడెపురం, కార్లపూడి గ్రామాల్లో భూకంపం సంభవించింది.