మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్‌ మంజూరు

  • Published By: vamsi ,Published On : August 28, 2020 / 12:44 PM IST
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈఎస్‌ఐలో స్కామ్‌‌లో తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని అరెస్టు చేయగా.. ఆయన అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు.



పోలీసులు అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఆయనకు కరోనా సోకింది. కోర్టు ఆదేశాలతో ప్రైవేటు ఆస్పత్రిలో అచ్చెన్నకు ప్రభుత్వం చికిత్స అందిస్తోండగా.. ఈ కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
https://10tv.in/tamil-actress-meera-mitun-says-she-wants-to-visit-nithyanandas-kailasa-country/
రెండు లక్షల హామితో బెయిల్ మంజూరు చేశారు. దేశం విడిచి వెళ్లడానికి కోర్టు అనుమతి తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి. సాక్షులను ప్రభావితం చేయరాదు. దర్యాప్తు అధికారులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది.