Well : ఫోన్‌ మాట్లాడుతూ వెళ్లి బావిలో పడ్డాడు

ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ.. పక్కన బావి ఉన్న సంగతి మరిచాడు. ఆలా నడుచుకుంటూ ముందుకు వెళ్లి 60 అడుగుల లోతున్న పాడుబడిన బావిలో పడిపోయాడు. రక్షించాలని కేకలు వేశాడు.. సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు.

Well : ఫోన్‌ మాట్లాడుతూ వెళ్లి బావిలో పడ్డాడు

Well

Well : ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ.. పక్కన బావి ఉన్న సంగతి మరిచాడు. ఆలా నడుచుకుంటూ ముందుకు వెళ్లి 60 అడుగుల లోతున్న పాడుబడిన బావిలో పడిపోయాడు. రక్షించాలని కేకలు వేశాడు.. సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో అటుగా వచ్చిన పశువుల కాపరికి కేకలు వినిపించడంతో బావిలో ఓ వ్యక్తి పడినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కాగా ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరుకు చెందిన చంద్రశేఖర్ గురువారం మధ్యాహ్నం పట్టణానికి సమీపంలోని దాబాలో భోజనం చేశాడు. అనంతరం ఫోన్ మాట్లాడుకుంటూ దాబా వెనక్కు నడిచివెళ్ళాడు. ఇదే సమయంలో అక్కడ పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆ బావిలో 20 అడుగుల లోతు నీరు ఉంది. చంద్రశేఖర్ కి ఈత రావడంతో బావిలో ఉన్న చెట్ల వేర్లను పట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు.

అయితే బావిలో పడిన సమయంలో కాపాడాలంటూ కేకలు వేశాడు చంద్రశేఖర్, సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు. శుక్రవారం జీవన్ కుమార్ అనే వ్యక్తి పశువులు మేపుతూ బావి సమీపంలోకి వచ్చాడు. బావిలోంచి కేకలు వినిపించాయి. వెంటనే పోలీసులకు, స్థానిక గ్రామస్తులకు సమాచారం అందించాడు. పోలీసులు ఫైర్ సిబ్బందిని తీసుకోని బావిదగ్గరకు వచ్చి మూడు గంటలు శ్రమించి బావిలించి బయటకు తీశారు.

తాను ప్రాణాలతో బయటపడాతానని అనుకోలేదన్న చంద్రశేఖర్‌.. తనను కాపాడిన జీవన్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.