పారిశ్రామికవేత్త పీవీపీ పై కేసు : దౌర్జన్యం చేశారని ఆరోపణ

పారిశ్రామికవేత్త పీవీపీ పై కేసు : దౌర్జన్యం చేశారని ఆరోపణ

వైసీపీ నాయకుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త పీవీపీ ఒక భూ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో 3 కేసులు నమోదయ్యాయి. 40 మంది అనుచరులతో తన ఇంటిపై పొట్లూరి వరప్రసాద్ దాడి చేశారని కైలాష్ విక్రం అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

తన ఇంటి టెర్రస్ పై గార్డెన్ కట్టోద్దని పీవీపీ తనను బెదిరిస్తున్నాడని కైలాష్ ఆరోపిస్తున్నాడు. ఒక విల్లాలోకి దౌర్జన్యంగా  వెళ్లి దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీవీపీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read: మీ లక్ష్యం పేద ప్రజలే కావాలి, రాజకీయ ప్రత్యర్థులు కాదు.. సీఎం జగన్ పై ఉండవల్లి ఆగ్రహం