AP MLC Posts : ఏపీలో నలుగురు ఎమ్మెల్సీలు, గవర్నర్ నోటిఫికేషన్ జారీ

నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు ఏపీ రాష్ట్ర గవర్నర్. ఈ మేరకు 2021, జూన్ 21వ తేదీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, అప్పిరెడ్డి, రమేశ్ లను ఎంపిక చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు.

AP MLC Posts : ఏపీలో నలుగురు ఎమ్మెల్సీలు, గవర్నర్ నోటిఫికేషన్ జారీ

Ap Mlc

Four MLCs In AP : నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు ఏపీ రాష్ట్ర గవర్నర్. ఈ మేరకు 2021, జూన్ 21వ తేదీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, అప్పిరెడ్డి, రమేశ్ లను ఎంపిక చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు.

గవర్నర్ కోటాలో ఎన్నికైన టిడి జనార్దన్, బీద రవిచంద్ర, గౌవిగారి శ్రీనివాస్, పి.శమంతకమణిలకు జూన్ 11తో పదవీ కాలం ముగియగా వీరి స్థానంలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో నలుగురికి కొత్తగా ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.

గవర్నర్ కోటాలో ఎన్నికయ్యే ఈ సభ్యులకు సాధారణంగా అధికార పార్టీకి చెందిన వారికే అవకాశం ఉండగా ఇప్పటికే వైసీపీ అధిష్టానం సభ్యులను ఎంపిక చేసి లిస్ట్ రాజ్ భవన్ కు పంపింది. ఇందులో మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు, రమేశ్ యాదవ్, లెల్ల అప్పిరెడ్డి పేర్లు ప్రతిపాదించారు. 2021, జూన్ 14వ తేదీ సోమవారం గవర్నర్ ఆమోదించారు.