AP Omicron : బ్రేకింగ్ న్యూస్..ఏపీలో రెండు ఒమిక్రాన్ కేసులు..ఏ జిల్లాల్లో

భర్త , కొడుకులకు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ గా వచ్చాయి. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది...

AP Omicron : బ్రేకింగ్ న్యూస్..ఏపీలో రెండు ఒమిక్రాన్ కేసులు..ఏ జిల్లాల్లో

Omicron Ap

Third Omicron Case AP : తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. ఏపీ రాష్ట్రంలో కొత్త వేరియంట్ మెల్లిమెల్లిగా జిల్లాలకు విస్తరిస్తోంది. లెటెస్ట్ గా రెండు జిల్లాలో కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 2021, డిసెంబర్ 24వ తేదీ శుక్రవారం రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి తూర్పు గోదావరిలో కాగా…మరొకటి విశాఖలో నమోదైంది.

Read More : Allahabad High Court : అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడుతాయా ? అలహాబాద్ హైకోర్టు కీలక సూచనలు

అయినవిల్లి మండలం పెదపాలెంలో వైరస్ కేసు నమోదైంది. ఇటీవలే కువైట్ నుంచి వచ్చిన మహిళకు ఈ వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈనెల 19వ తేదీన గన్నవరం ఎయిర్ పోర్టులో పరీక్షలు నిర్వహించగా ఆర్టీపీసీఆర్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హోమ్ ఐసోలేషన్ ఉండాలని అధికారులు సూచించారు. ఈమె దగ్గరి నుంచి శాంపిల్స్ తీసుకుని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపించారు. అక్కడ ఒమిక్రాన్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. భర్త , కొడుకులకు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ గా వచ్చాయి.

Read More : India : ఒమిక్రాన్ టెన్షన్..భారతదేశంలో మళ్లీ ఆంక్షలు..ఏ రాష్ట్రంలో ఎలా

యూఏఈ నుంచి విశాఖకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకింది. ఇతని శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించగా ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది.

Read More : Bangladesh Ferry Fire : బంగ్లాదేశ్‌లో ఫెర్రీ బోట్‌కు ప్రమాదం.. 32మంది మృతి, 100 మందికి గాయాలు

మరోవైపు…ఊహించినట్టే భారత్‌ ఒమిక్రాన్ హబ్‌గా మారుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసి బ్రిటన్, అమెరికాను వణికిస్తోన్న వేరియంట్.. ఇప్పుడు భారత్‌ను బెంబేలెత్తిస్తోంది. కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య నాలుగు వందలకు చేరువయింది. మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.