ఆ నలుగురు నీచులు వీరే : సంచలనం రేపుతున్న బాలుడిపై గ్యాంగ్ రేప్

ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు. మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. గదిలో నిర్భధించి దారుణానికి ఒడిగట్టారు. కామంతో కళ్లు మూసుకుపోయి మృగాళ్లుగా

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 03:10 PM IST
ఆ నలుగురు నీచులు వీరే : సంచలనం రేపుతున్న బాలుడిపై గ్యాంగ్ రేప్

ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు. మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. గదిలో నిర్భధించి దారుణానికి ఒడిగట్టారు. కామంతో కళ్లు మూసుకుపోయి మృగాళ్లుగా

ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు. మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. గదిలో నిర్భధించి దారుణానికి ఒడిగట్టారు. కామంతో కళ్లు మూసుకుపోయి మృగాళ్లుగా ప్రవర్తించారు. చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఒకరి తర్వాత ఒకరు విరుచుకుపడి కామవాంఛ తీర్చుకున్నాడు. మరి ఆ నలుగురు కీచకులు…దారుణానికి ఒడిగట్టింది ఎవరి మీదో తెలిస్తే షాక్‌కు గురవుతున్నారు. సిగ్గుతో తలదించుకుంటారు. వీళ్లు మనుషులేనా అంటూ చిదరించుకుంటారు.

చెట్టుకి చీర కట్టినా..
నీచులు..కిరాతకులు..మృగాళ్లు..కామాన్ని నరనరాన నింపుకున్న కామాంధులు..చెట్టుకు చీర కట్టినా.. నీచానికి పాల్పడే చెండా లంగాళ్లు.. మనిషినన్న మాటే మరిచి.. అకృత్యాలకు పూనుకుంటున్న పాపిష్టి నాయళ్లు.. ఇప్పుడు చెప్పుకోబోయే కీచకుల గురించి వర్ణించడానికి ఇవి కూడా సరిపోవేమో. అవును…ఈ దారుణ ఘటన గురించి తెలుసుకుంటే మీరు చీదరించుకుంటారు. 

అమ్మాయిలకే కాదు అబ్బాయిలకూ రక్షణ లేదు:
దిశ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తక్షణమే కామాంధులను ఉరి తీయాలంటూ ఆందోళనలు జరిగాయి. ఆ నిందితులకు ఉరి పడకపోయినా.. ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఆ ఘటన తర్వాత ఆడవాళ్లపై అత్యాచారాలు, లైంగిక దాడులకు అడ్డుకట్ట పడుతుందని అంతా భావించారు. కానీ దిశ ఘటన తర్వాత కూడా మార్పు లేదు. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా రక్షణ కరువైంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకులు…మగాళ్లని కూడా వదలడం లేదు. మాయమాటలు చెప్పి తీసుకెళ్తున్నారు. కామవాంఛ తీర్చుకుంటున్నారు. చిత్రహింసలు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.

డిన్నర్ పేరుతో బాలుడిపై గ్యాంగ్ రేప్:
అభం శుభం తెలియని ఓ బాలుడిపై ఎలా లైంగిక దాడికి పాల్పడ్డారు… చిత్రహింసలు పెట్టారు.. బాలుడిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా అవుకులో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అవుకు పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాలుడిని డిన్నర్‌ పేరుతో పిలిచి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అవుకు పట్టణానికి చెందిన ఓ బాలుడు మూడు రోజుల క్రితం ఒంటరిగా ఆడుకుంటుండగా డిన్నర్‌ పేరుతో నలుగురు యువకులు బలవంతంగా తీసుకెళ్లారు. అభంశుభం తెలియని ఆ బాలుడిపై పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. నలుగురు కలిసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడికి రక్తస్రావమై అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు ఆరా తీయగా ఆ కిరాతకుల నిర్వాకం బయటపడింది.

తమ కొడుకుపై దారుణానికి ఒడిగట్టిన కిరాతకులను కఠినంగా శిక్షించాలంటూ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు…ఆ కామాంధులను బుల్లెట్ రాజ్, ప్రేమ్‌ కుమార్, రాజా, సునీల్‌గా గుర్తించారు. నలుగురిపై గతంలోనే రౌడీ షీట్‌ కేసులున్నట్లు గుర్తించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

12