ఏలూరులో దారుణం : లిఫ్ట్ ఇస్తానని వివాహితపై గ్యాంగ్ రేప్

ఏలూరులో దారుణం జరిగింది. వివాహితను గ్యాంగ్ రేప్ చేశారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి యాకోబు అనే వ్యక్తి మహిళను బైక్ పై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాన

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 01:33 AM IST
ఏలూరులో దారుణం : లిఫ్ట్ ఇస్తానని వివాహితపై గ్యాంగ్ రేప్

ఏలూరులో దారుణం జరిగింది. వివాహితను గ్యాంగ్ రేప్ చేశారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి యాకోబు అనే వ్యక్తి మహిళను బైక్ పై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాన

ఏలూరులో దారుణం జరిగింది. వివాహితను గ్యాంగ్ రేప్ చేశారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి యాకోబు అనే వ్యక్తి మహిళను బైక్ పై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాన నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఆరుగురితో కలిసి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ముగ్గురు రౌడీషీటర్లు ఉన్నట్టు పోలీసులకు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. వివాహిత గ్యాంగ్ రేప్ ఘటన జిల్లాలో కలకలం రేపింది.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్ దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసినా, దిశ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి దురాఘతాలకు ఒడిగడుతున్నారు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడ పిల్లలకు కూడా రక్షణ కరువైంది. ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందో రాదో అని తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. కఠిన చట్టాలు తీసుకురావడమే కాదు.. వాటిని వెంటనే అమలు చేయాలని.. అప్పుడే మృగాళ్లలో భయం మొదలవుతుందని, ఇలాంటి ఘోరాలకు అడ్డుకట్ట పడుతుందని మహిళా సంఘాలు చెబుతున్నాయి.

Also Read : కూతుర్ని రేప్ చేసిన HIV వ్యక్తికి జీవిత ఖైదు