మట్టిదిబ్బలో బంగారు నాణాలు, తీసుకునేందుకు ఎగబడిన జనాలు, రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
gold coins: చిత్తూరులో మట్టిదిబ్బలో బంగారు నాణాలు బయటపడ్డాయి. కుప్పం సరిహద్దులో తమిళనాడులోని హోసూరు సమీపంలో మట్టిదిబ్బలో బంగారు నాణాలు కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు, వాహనదారులు నాణాలను ఏరుకున్నారు. బంగారు నాణాల కోసం జనాలు ఎగబడ్డారు. దీంతో హోసూరు-బాగలూర్ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫ్ జామ్ అయ్యింది.
ఒక్కో నాణెం ధర 2 గ్రాముల బరువు ఉంటుందని అంచనా. గోల్డ్ కాయిన్స్ పై అరబిక్ లిపిలో అక్షరాలు ఉన్నాయి. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. గోల్డ్ కాయిన్స్ అక్కడికి ఎలా వచ్చాయి అనే దానిపై విచారణ చేపట్టారు.