Kuppam: కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లేయని ప్రభుత్వ ఉద్యోగులు
ఏపీలో ఆసక్తికరంగా ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్నది కుప్పం ఎన్నికల ఫలితాల కోసమే.
Kuppam: ఏపీలో ఆసక్తికరంగా ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్నది కుప్పం ఎన్నికల ఫలితాల కోసమే. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి కనబరచలేదు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక్కటి కూడా కుప్పంలో నమోదు కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేకపోవడంతో నేరుగా ఓట్ల లెక్కింపు కుప్పంలో ప్రారంభమైంది.
కుప్పంలో మున్సిపాలిటి ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లో ఒక్కరంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగీ ఓటు హక్కు వినియోగించుకోకపోవడం విశేషం. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. కుప్పంలో మెజారిటీ వార్డుల్లో వైసీపీ ముందంజలో ఉంది.