హైదరాబాద్లో దారుణం : మూడేళ్ల బాలుడిని చంపేసిన పెద్దమ్మ..తనకు సంతానం కల్గలేదనే అక్కసుతో హత్య
Grandmother kills boy : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. తనకు సంతానం కల్గలేదనే అక్కసుతో మరిది కొడుకును చంపేసింది. భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదీబజార్లో నుమానుద్దీన్ అనే మూడేళ్ల బాలుణ్ణి పెద్దమ్మ ఆయేషా దారుణంగా చంపేసింది.
తనకు పెళ్లై మూడేళ్లవుతున్నా సంతానం కలగకపోవడంతో అక్కసు పెంచుకున్న ఆయేషా.. తన భర్త తమ్ముడి కుమారుడిని రెండంతస్తుల భవనం పైనుంచి పడేసింది.
దీంతో నుమానుద్దీన్ అనే బాలుడు చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. ఆయేషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయేషాకు పిల్లలు లేకపోవడం వల్లే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుందని చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.