Tirumala Traffic Restrictions : టీటీడీ సంచలన నిర్ణయం.. కొండపైకి వాహనాలు బంద్, పాసులున్నా నో పర్మిషన్

తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కు ప్లేస్ లేకపోవడంతో తిరుమల కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు పోలీస్ శాఖ. కార్లతో పాటు అన్ని ఫోర్ వీలర్ వెహికల్స్ ను అలిపిరి వద్దే నిలిపేస్తున్నారు.

Tirumala Traffic Restrictions : టీటీడీ సంచలన నిర్ణయం.. కొండపైకి వాహనాలు బంద్, పాసులున్నా నో పర్మిషన్

Tirumala Traffic Restrictions : తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కు ప్లేస్ లేకపోవడంతో తిరుమల కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు పోలీస్ శాఖ. కార్లతో పాటు అన్ని ఫోర్ వీలర్ వెహికల్స్ ను అలిపిరి వద్దే నిలిపేస్తున్నారు. తిరుమలలో వాహనాలతో పార్కింగ్ ప్లేస్ నిండిపోయిందని, కొత్త వాహనాలు వెళ్లేందుకు అనుతించేది లేదని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. పోలీసుల నిర్ణయంతో భక్తులు తమ వాహనాలను అలిపిరి వద్దే పార్కింగ్ చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా తిరుమలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

తిరుమల భక్త జన సంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం కొండపై ఉన్నారు. తిరుమల కొండపైకి భారీగా వాహనాలు వచ్చాయి. పార్కింగ్ ప్లేస్ లన్నీ వాహనాలతో నిండిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొండపైకి కొత్త ప్రైవేట్ వాహనాలను అనుమతించడం లేదు. కారు పాసులన్నా సరే.. పోలీసులు మాత్రం కొండపైకి ప్రైవేట్ వాహనాలను అనుమతించడం లేదు.

తిరుమలలో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం అయిన గరుడవాహన సేవ నేడు జరగనుంది. శ్రీవారి గరుడ వాహన సేవను కనులారా చూసి తరించేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండ భక్తజనంతో నిండిపోయింది. పార్కింగ్ ప్లేస్ లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొండపైకి ప్రైవేట్ వాహనాలకు నో ఎంట్రీ అని చెప్పింది. కొండపైకి ఇక ప్రైవేట్ వాహనాలను అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. కొండపై ఉన్న ప్రైవేట్ వాహనాల పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలను అలిపిరి దగ్గరే నిలిపివేశారు. వాహనాలను అక్కడే పార్క్ చేసి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా కొండపైకి రావాలని భక్తులకు సూచించింది టీటీడీ.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, నేడు రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ గరుడోత్సవం నిర్వహించనున్నారు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. 3 లక్షల మందిని తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ బస్సులతో 3 వేల ట్రిప్పులు నడుపుతోంది. అలిపిరి పాత చెక్ పోస్ట్ శ్రీవారి మెట్టు దగ్గర బైక్ లకు పార్కింగ్ పాయింట్ గా నిర్దేశించారు. తిరుమల కొండపై ఏడు ప్రాంతాల్లో టీటీడీ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.

తిరుమాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి భక్తులు సులువుగా ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. అన్నప్రసాదాల భవనాల్లో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1.30 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాల వితరణ చేయనున్నారు. ఫుడ్ కౌంటర్ల ద్వారా కూడా అన్నప్రసాదాలు అందించనున్నారు.

తిరుమాడ వీధుల్లో 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. లడ్డూల కొరత లేకుండా బఫర్ స్టాక్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. పీఏసీ-4లో మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1111 కు కాల్ చేయాలని టీటీడీ సూచించింది.