తిరుపతిలో టెన్షన్.. టీడీపీ, బీజేపీ నేతలు హౌజ్ అరెస్ట్

  • Published By: naveen ,Published On : September 23, 2020 / 12:18 PM IST
తిరుపతిలో టెన్షన్.. టీడీపీ, బీజేపీ నేతలు హౌజ్ అరెస్ట్

తిరుపతిలో టీడీపీ, బీజేపీ నేతలను హౌజ్‌ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. సీఎం జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో.. బీజేపీ, టీడీపీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో తిరుపతిలో బందోబస్తు పెంచారు పోలీసులు. ఇరు పార్టీల ముఖ్య నేతలను ఇళ్లలోనే నిర్బంధిస్తున్నారు.

ఒక ఎఎస్పీ, ఇద్దరు డిఎస్పీలు, ముగ్గురు సిఐలు, నలుగురు ఎస్ఐలు, 60 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఇంకా స్పెషల్ పార్టీ బందోబస్తు నడుమ సీఎం జగన్ తిరుమలలో పర్యటించనున్నారు. బుధవారం(సెప్టెంబర్ 23,2020) మధ్యాహ్నం ఒంటి గంటకు సిఎం జగన్ తిరుపతి విమానాశ్రయం చేరుకునే అవకాశం ఉంది. అతి ముఖ్యులకు మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతి ఇస్తారు. మంగళవారం రాత్రి విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయ్ తో ట్రయల్ రన్ నిర్వహించారు పోలీసులు.