Andhra Pradesh : అక్టోబర్ 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలు పునఃప్రారంభం
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
education institutions reopen : కరోనా విజృంభణ కారణంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉమ్మడి అకడమిక్ కేలండర్ను విడుదల చేసింది.
సాధారణ డిగ్రీ, పీజీ కళాశాలల్లో అక్టోబరు 1వ తేదీ నుంచి సెమిస్టర్-1,3,5 తరగతులు ప్రారంభం కానున్నాయి. జనవరి 24 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి సెమిస్టర్-2,4,6కు సంబంధించిన తరగతులు జరుగనున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి పరీక్షలు జరుగనున్నాయి. కాగా రెండో సెమిస్టర్ తర్వాత కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టుకు, నాలుగో సెమిస్టర్ తర్వాత వేసవి ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్కు 8 వారాల సమయం ఉంటుంది.
Andhra Pradesh : ఏపీలో తగ్గిన కరోనా కేసులు
ఇక టెక్, బీ ఫార్మసీ కోర్సులకు అక్టోబరు 1వ తేదీ నుంచి సెమిస్టర్-1,3,5,7కు సంబంధించిన తరగతులు నిర్వహిస్తారు. జనవరి 24 నుంచి సెమిస్టర్-3 పరీక్షలు జరుగనున్నాయి. ఫిబ్రవరి7 నుంచి సెమిస్టర్-1,5,7 ముగింపు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి1వ తేదీ నుంచి సెమిస్టర్-2,6,8 కు సంబంధించిన తరగులు పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 23వ తేదీ నుంచి ముగింపు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నాలుగో సెమిస్టర్ ప్రారంభం కానుంది. జూన్1వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నాలుగో సెమిస్టర్ తర్వాత కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టుకు 8వారాల సమయం ఉంటుంది.
ఏపీ స్కూల్స్ విద్యార్ధులకు జగన్ సర్ప్రైజ్
పీజీ కోర్సులకు నవంబరు ఒకటి నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. మార్చి1వ తేదీ నుంచి సెమిస్టర్-1,3,5 పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 14వ తేదీ నుంచి 2,4,6 తరగతులు ప్రారంభించనున్నారు. జులై 4వ తేదీ నుంచి ముగింపు పరీక్షలు జరుగనున్నాయి.