మంత్రి కొడాలి నానికి బాలయ్య సీరియస్ వార్నింగ్, మాటల మనిషిని కాదు..చేతలు కూడా చూపిస్తా
Hindupur MLA Balakrishna Warning : ఏపీ మంత్రి కొడాలి నానికి సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమను రెచ్చగొడితే..తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయం, చట్టంపై లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. నోరు అదుపులో పెట్టుకో..సహనాన్ని పరీక్షించవద్దన్నారు. ఉత్తుత్తి మాటలు చెప్పడానికి తాను మాటల మనిషిని కాదని, అవసరమైతే..చేతలు కూడా చూపిస్తానన్నారు. పేకాటలో పట్టుబడిన వారు రూ. 10 వేలు చెల్లించి బయటకు వస్తున్నట్లు, మళ్లీ జూదం ఆడతామంటున్నారని విమర్శించారు.
2021, జనవరి 06వ తేదీ బుధవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా..బాలకృష్ణ ఫ్యాన్స్, టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కంది పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతుల కోసం అందరం రోడ్డెక్కాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. హిందువులనే కాదు..అన్ని మతస్తులను ఆవేదనకు గురి చేస్తున్నారాయన. ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని చెప్పారు. టీడీపీ హాయంలో…ఇన్ పుట్ సబ్సిడీ, పంటనష్టం అందించామని, తూతు మంత్రిగా ప్రస్తుత ప్రభుత్వం ఇస్తోందని విమర్శించారు.
హిందూపురం వస్తున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు అభిమానులు,#టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
కొవిడ్ సమయంలో తన సొంత నిధులు రూ.కోటి విలువైన మందులు, పరికరాలు అందించిన సందర్భంగా హిందూపూర్ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ఆయన్ను సన్మానించనున్నారు.#Balayya #HindupurMLA pic.twitter.com/fBQIGBFclM
— manabalayya.com✨ (@manabalayya) January 6, 2021
#హిందూపురం : రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్న హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి #బాలకృష్ణ.#Balayya #HindupurMLA #HMLANBK pic.twitter.com/Y52ylvWsDd
— manabalayya.com✨ (@manabalayya) January 6, 2021