బాలకృష్ణ వార్నింగ్ : నేను కను సైగ చేస్తే ఏమయ్యేది
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. తన పర్యటనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కనుసైగ చేసి ఉంటే..పరిస్థితి ఏమయ్యేదని కామెంట్ చేశారు. మౌనం చేతగానితనం అనుకోకండంటూ సూచించారు.
మంత్రులకు అవగాహన లేక అసెంబ్లీలో గొడవ పడుతున్నారని, తాము చేసిన అభివృద్ధి కళ్లెదుటే కనబడుతుందన్నారు. 2020, జనవరి 31వ తేదీ శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతోందని, దేశంలో ఎక్కడైనా రాజధాని ఒకేచోట ఉంటుందని తెలిపారు.
రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా అభివృద్ధి చేయాలి ? ఆదాయం సమకూర్చుకునే విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని విమర్శించారు. రాష్ట్రంలో అంతా రివర్స్ పాలనే సాగుతున్నదని, ఒకే రాష్ట్రం ఒకే రాజధానితోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
మండలి చైర్మన్పై మంత్రులు అసభ్య పదజాలం ఉపయోగించడం బాధాకరమని, విష సంస్కృతిని మానుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని, ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పారు ఎమ్మెల్యే బాలకృష్ణ.
బాలయ్యకు ఎందుకు కోపం వచ్చింది :-
* అనంతపురం హిందూపురంలో బాలకృష్ణ 2020, జనవరి 30వ తేదీ గురువారం పర్యటించారు.
* ఆయన్ను వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
* అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డు పడుతున్నారంటూ మండిపడ్డారు.
* రాయలసీమకు అన్యాయం చేసిన టీడీపీ లీడర్స్కు పర్యటించే హక్కు లేదని స్పష్టం చేశారు.
* రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
* బాలకృష్ణ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
* టీడీపీ నేతలు..వైసీపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
* పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
* తాజాగా బాలయ్య చేసిన కామెంట్స్పై వైసీపీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.
Read More : పాక్లోని హిందువులు, సిక్కులు భారత్కు రావొచ్చని గాంధీజీ చెప్పారు – రాష్ట్రపతి