పెళ్లింట విషాదం…అందరూ ఇంట్లో ఉండగా కుప్పకూలిన ఇల్లు..ఇద్దరు మృతి

  • Published By: bheemraj ,Published On : July 25, 2020 / 05:20 PM IST
పెళ్లింట విషాదం…అందరూ ఇంట్లో ఉండగా కుప్పకూలిన ఇల్లు..ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. అందరూ ఇంట్లో ఉండగానే ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత 108 వాహనం ఘటనాస్థలికి చేరుకుంది. 108 సిబ్బంది తీరుపై మొలగపల్లి గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 ఫోన్ చేసినా సిబ్బంది సరిగ్గా స్పందించలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.

అందరూ ఇంట్లో కూర్చుని మాట్లాడుతుండగా కురిసిన వర్షానికి ఇల్లు కూలింది. ఇంట్లో కూర్చున్న నలుగురిపై ఇల్లు కుప్పకూలి పడటంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇల్లు పడిపోవడంతో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే గాయాలైన సందర్భంగా 108కి ఫోన్ చేసినప్పటికీ గంట సేపు వరకు కూడా స్పందించలేదు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శిథిలాల కింద ఇద్దరు చిన్నారులు ఇరుక్కుపోవడంతో కుటుంబ సభ్యులు ఇల్లును పెకిలించి వారిని ఆస్పత్రికి తరలించారు. ఒక మహిళ కాలు విరిగి బయటివచ్చింది. రాళ్లు నరుక్కొవడంతోనే కాలు పూర్తిగా తెగిపోయింది. దీనికి సంబంధించి అక్కడే ఉన్న ప్రజలు అనేక మంది 108 ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు 108 సిబ్బంది వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.