“world class” Tirupati Railway Station : “వరల్డ్ క్లాస్”గా తిరుపతి రైల్వే స్టేషన్!…డిజైన్లను విడుదల చేసిన రైల్వే శాఖ మంత్రి
కలియుగ ప్రత్యక్ష దైవం..అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు..శ్రీ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతిలోని రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా రూపుదిద్దుకోనుంది. ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్ కు సంబంధించి డిజైన్లను రైల్వే శాఖా మంత్రి శైష్ణవ్ విడుదల చేశారు.
“world class” Tirupati Railway Station :కలియుగ ప్రత్యక్ష దైవం..అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు..శ్రీ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతిలోని రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా రూపుదిద్దుకోనుంది. ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్ కు సంబంధించి డిజైన్లను రైల్వే శాఖా మంత్రి శైష్ణవ్ విడుదల చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ కు స్వదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు నిత్యం వేలాదిమంది వస్తుంటారు. అటువంటి రైల్వే స్టేషన్ దాదాపు 25 ఏళ్లుగా అలాగే ఉంది ఏమాత్రం అభివృద్ది లేకుండా. కానీ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో తిరుపతి రైల్వే స్టేషన్ ఇక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా రూపు దిద్దుకోనుంది.
దేశ, విదేశాల నుంచి వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ఆ రద్దీకి తగ్గట్టుగా రైల్వే స్టేషన్లో ఇప్పటిదాకా పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలా మాత్రం కనిపించదు. కానీ ఇక తిరుపతి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా తిరుపతి రైల్వే స్టేషన్ మారిపోతోంది.
తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్కు సంబంధించిన డిజైన్లు ఇప్పటికే పూర్తి కాగా… ఆయా పనులను వేర్వేరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కూడా జరిగిపోయింది. పనులు రజమా కూడా శరవేగంగా జరిగిపోనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం (మే 30,2022) రాత్రి వరల్డ్ క్లాస్ తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్ల ఫొటోలను ట్విట్టర్లో విడుదల చేశారు. దీనికి సంబంధించిన టెండర్లన్నీ పూర్తయ్యాయని..త్వరలోనే పనులు మొదలు కానున్నాయని వెల్లడించారు.