లైసెన్స్ లేకుంటే జైలుకే : సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ట్రాఫిక్ రూల్ తీసుకొచ్చింది. ఇకపై లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకి పంపిస్తారు. ఇప్పటివరకు భారీ

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 09:17 AM IST
లైసెన్స్ లేకుంటే జైలుకే : సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ట్రాఫిక్ రూల్ తీసుకొచ్చింది. ఇకపై లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకి పంపిస్తారు. ఇప్పటివరకు భారీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ట్రాఫిక్ రూల్ తీసుకొచ్చింది. ఇకపై లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే నేరుగా జైలుకి పంపిస్తారు. ఇప్పటివరకు భారీ జరిమానాలతో సరిపెట్టుకున్న రవాణాశాఖ ఇకపై రూల్స్‌ను కఠినతరం చేయనుంది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 88వేల 872 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ.. లైసెన్సులు లేకుండా బండి నడిపే వారిని జైలుకు పంపాలని రవాణాశాఖకు సూచించింది. దీంతో ఏపీ రవాణాశాఖ కఠిన చర్యలకు రెడీ అవుతోంది.

2020లో రోడ్డు ప్రమాదాలను 20 శాతం తగ్గించాలనే ఉద్దేశంతో పోలీసులతో కలిసి సంయుక్తంగా డ్రైవింగ్ లైసెన్సుల తనిఖీలను ముమ్మరంగా చేపట్టనున్నారు. మరోవైపు లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం విద్యార్హతను తొలగించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే 8వ తరగతి నిబంధనను ఏపీ ప్రభుత్వం తొలగించింది. అంతేకాకుండా సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులు కూడా త్వరలోనే అందుబాటులోకి రానుండటంతో వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సు పొందడం మరింత ఈజీ కానుంది.

చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ఒకవేళ పట్టుబడితే జరిమానా చెల్లించి వెళ్లిపోతున్నారు. మళ్లీ షరా మూములే. భారీగా ఫైన్లు వేస్తున్నా మార్పు రావడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తమ ప్రాణాలను రిస్క్ లో పడేసుకోవడమే కాదు.. అమాయకుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే ఫైన్లు మాత్రమే వేసే విధానానికి స్వస్తి పలకాలని ఏపీ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ లేకపోతే జరిమానా విధించకుండా ఏకంగా జైలుకి పంపించాలని డిసైడ్ అయ్యింది. ఈ నిర్ణయం వాహనదారులకు చెమట్లు పట్టిస్తోంది. వారి వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. ఇకనైనా.. మార్పు వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.

Also Read : మీకు తెలుసా.. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు మారాయి