Janasena MLA Rapaka : వైసీపీ సభలో జనసేన ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనాగ్రహ దీక్షలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పాల్గొన్నారు. వైసీపీ కండువా వేసుకుని రాజోలులో ర్యాలీ నిర్వహించిన రాపాక.. అనంతరం దీక్షలో కూర్చున్నారు.

Janasena MLA Rapaka : వైసీపీ సభలో జనసేన ఎమ్మెల్యే

Rapaka

YCP Rajolu janagraha Deeksha : తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనాగ్రహ దీక్షలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పాల్గొన్నారు. వైసీపీ కండువా వేసుకుని రాజోలులో ర్యాలీ నిర్వహించిన రాపాక వరప్రసాద్‌.. అనంతరం దీక్షలో కూర్చున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలుపొందిన రాపాక వరప్రసాద్‌… కొంతకాలంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిరామ్ పై వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు చేపట్టారు. మరోవైపు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన పట్టాభికి విజయవాడ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నవంబర్‌ 2 వరకు ఆయన రిమాండ్‌లోనే ఉండనున్నారు.

ఏపీ సీఎం జగన్.. టీడీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అధికారం దక్కలేదన్న అక్కసుతో.. చీకట్లో ఆలయాలపై దాడులు.. రథాలు తగలబెట్టడాలు.. సంక్షేమ పథకాలు అడ్డుకోవడం.. పిల్లలకు ఇంగ్లిష్ మీడయం అందకుండా కుట్రలు.. కోర్టుల్లో కేసులు వేయించి ఇళ్ల నిర్మాణాలు ఆపడం వంటి చర్యలకూ దిగుతున్నారని ఆరోపించారు. సీఎంను పట్టుకుని.. బోషిడీకే అంటూ అర్థాలు చెప్పలేని మాటలతో తిడుతున్నారని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు ఇదంతా గమనించాలని కోరారు.

Pattabhi : పట్టాభికి బెయిల్ వస్తుందా?

విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి సీఎం జగన్ హాజరయ్యారు. పోలీసుల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుందన్నారు. వీకాఫ్ సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. నేరాల అదుపులో సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. రూపు మారుతున్న నేరాల విషయంలో మరింత కచ్చితంగా వ్యవహరించాలని సూచించారు.