Janasena Support Farmers Padayatra : అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు

అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు తెలిపింది. రాజధాని కోసం రైతులు చేపట్టనున్న మహా పాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసపల్లి వరకు 900 కిలోమీటర్ల వరకు కొనసాగే పాదయాత్రకు గ్రామాల్లోని జనసేన కార్యకర్తలు పూర్తిగా సహకరించాలని సూచించారు.

Janasena Support Farmers Padayatra : అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు

Janasena Support Farmers Padayatra

Janasena Support Farmers Padayatra : అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు తెలిపింది. రాజధాని కోసం రైతులు చేపట్టనున్న మహా పాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసపల్లి వరకు 900 కిలోమీటర్ల వరకు కొనసాగే పాదయాత్రకు గ్రామాల్లోని జనసేన కార్యకర్తలు పూర్తిగా సహకరించాలని సూచించారు.

జగన్‌ సీఎం అయ్యాక ప్రజలతో మాట్లాడే తీరిక లేకుండా పోయిందని విమర్శించారు. ఒక్క రాజధానినే నిర్మించని వారు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఏపీకి రాజధానిగా అమరావతి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్‌కు ప్రజలే బుద్ధి జెబుతారని చెప్పారు.

Janasena : రాజధాని రైతుల పాదయాత్ర.. జనసేన కీలక నిర్ణయం

వేల కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం జరుగుతుంటే.. మూడు రాజధానులంటూ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రాజధానిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. ఖాతరు చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాజధానిపై మంత్రులు రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం విచారకరమన్నారు.