రైతు పక్షమే, అమరావతికి జనసేనాని హామీ

రైతు పక్షమే, అమరావతికి జనసేనాని హామీ

రాజధాని తరలింపు వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై పార్టీ అధినేత స్పందించారు. రాజధాని తరలింపు, పాలన వికేంద్రీకరణ విషయంలో జనసేన తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయం వ్యక్దం చేస్తోందన్నారు.

రాజధాని తరలింపుపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయనీ.. ఈ వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్టు సూచించింది. న్యాయనిపుణుల సలహాలతో గడువులోగా కౌంటర్ దాఖలు వేస్తామని పవన్ అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదనీ.. ఈ కేసులో తుది వరకు బాధ్యతగా నిలబడతామని పవన్ హామీ ఇచ్చారు.