మా ప్రభుత్వం కూడా వస్తుంది.. అధికారులను, పోలీసులను మా కార్యకర్తలే చూసుకుంటారు.. టీడీపీ నేత వార్నింగ్

  • Published By: naveen ,Published On : October 9, 2020 / 04:49 PM IST
మా ప్రభుత్వం కూడా వస్తుంది.. అధికారులను, పోలీసులను మా కార్యకర్తలే చూసుకుంటారు.. టీడీపీ నేత వార్నింగ్

jc diwakar reddy warning: టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసి దివాకర్‌రెడ్డి తాడిపత్రిలోని గనులు, భూగర్భ శాఖ కార్యాలయం దగ్గర హల్‌చల్‌ చేశారు. అధికారులపై ఆయన చిందులు తొక్కారు. అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గనుల్లోకి 8 జీపులు వేసుకుని వచ్చి అధికారులు తనిఖీ చేయడంలో ఆంతర్యమేంటో చెప్పాలని జేసీ దివాకర్ ప్రశ్నించారు.

మా గనుల్లో ఏమైనా నక్సలైట్లు ఉన్నారా అని నిలదీశారు. మా తమ్ముడిని టార్గెట్‌ చేయడం పూర్తయ్యిందని.. ఇప్పుడు నన్ను కూడా టార్గెట్‌ చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. పోలీసులు బదిలీలకు భయపడి.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించ వద్దన్నారు. ఎప్పుడూ కాలం ఒకేలా ఉండబోదని.. టీడీపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తుందన్నారు. అప్పుడు అధికారులు, పోలీసులను మా పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని హెచ్చరించారు. సోమవారం తన కార్యాచరణ ప్రకటించనున్నట్టు జేసీ స్పష్టం చేశారు.

* అధికారులపై మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చిందులు
* ఇప్పుడు నాకు సత్కారం చేయవచ్చు కానీ.. ఇంతకంటే ఎక్కువ సత్కారం ఇచ్చే సమయం వస్తుంది -జేసీ దివాకర్‌రెడ్డి
* ప్రభుత్వం ఇంతవరకు నా తమ్ముడి కుటుంబంపై పగ తీర్చుకుంది
* ఇప్పుడు నా కుటుంబంపైకి మరలింది
* అధికారులు ట్రాన్స్‌ఫర్‌, సస్పెండ్‌లకు భయపడి ఉద్యోగాలు చేన్నారు
* త్వరలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యపాలన వస్తుంది
* మా జీవనాధారం ఈ గనులే.. నా కడుపు కొట్టకండి
* 8 జీపులు వేసుకుని వచ్చి మా గనుల్లో తనిఖీ చేయడంలో ఆంతర్యం ఏంటి?
* మా గనుల్లో ఏమైనా నక్సలైట్లు ఉన్నారా
* పోలీసులు బదిలీలకు భయపడి అధికార పార్టీకి ఊడిగం చేయకండి
* మా ప్రభుత్వం వస్తే మా కార్యకర్తలు అధికారులను.. పోలీసులను కోడి కంటే హీనంగా కాల్చుకుని తింటారు