కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన జేసీ

కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన జేసీ

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోమంటూ చేతులెత్తేసిన జేసీ సోదరులు యూటర్న్ తీసుకుని తాజాగా ఎన్నికల బరిలోకి అడుగుపెడుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాడిపత్రి పట్టణం 30వ వార్డు నుంచి పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం ఆయనతో  అనుచరులతోనూ కూడా రెండు సెట్ల నామినేషన్‌లు దాఖలు చేయించి అందరిని ఆశ్చర్యపరిచారు. 

టీడీపీకి అభ్యర్థులు దొరక్కపోవటం కారణంగా నేరుగా జేసీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తాడిపత్రి నుంచి అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో ఉంచే ఉద్దేశ్యంతోనే జేసీ సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా చర్చలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ కౌన్సిలర్‌గా నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. 

కౌన్సిలర్‌గా నామినేషన్‌ వేయడంపై రాజకీయవర్గాల్లో కూడా చర్చలు మొదలయ్యాయి. ప్లాన్ ప్రకారమే వెళ్తున్నారా.. ప్రత్యామ్నాయం లేక వెళ్తున్నారా అనేది సందిగ్ధంగా మారింది. 

See Also | రేవంత్ రెడ్డి అరాచకాలకు కాంగ్రెస్‌లో కలకలం