పోటీకి పంపండి : పాల్ నామినేషన్లకు ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2019 / 10:18 AM IST
పోటీకి పంపండి : పాల్ నామినేషన్లకు ఆమోదం

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్లకు ఆమోదం లభించింది.నరసాపురం లోక్ సభ,అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిగా పాల్ దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. మంగళవారం(మార్చి-26,2019) సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన చేపట్టిన అధికారులు పత్రాలు అన్నీ సరిగ్గా ఉన్నందున నరసాపురం పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ స్థానానికి పాల్ వేసిన నామినేషన్లను ఆమోదించారు. అయితే సోమవారం(మార్చి-25,2019) భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వెసేందుకు పాల్ ఆలస్యంగా వెళ్లడంతో రిటర్నింగ్ అధికారి నిరాకరించిన విషయం తెలిసిందే.